Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో పతనం..
మంగళవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 9 గంటల 34 నిమిషాలకు 30 షేర్ల బిఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 321 పాయింట్లు నష్టపోయి 62,513 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 104 పాయిట్ల తగ్గి 18,592 వద్ద ట్రేడవుతోంది. యూఎస్ జాబ్ డేటా ప్రకారం ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించారు. దీంతో ఫెడరల్ రిజర్వ్ ఎక్కువ కాలం పాటు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండడంతో అమెరికా మార్కెట్లు వాల్ స్ట్రీట్ స్టాక్లలో పతనం కనిపించింది. ఈ ప్రభావం ఇండయన్ మార్కెట్ పై కూడ పడింది.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలివర్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిక్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ఉండగా.. ఐటీసీ, ఏసియన్ పేయింట్స్, ఎం&ఎం, పవర్ గ్రిడ్, మారుతీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, విప్రో, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్&టీ, అల్ట్రాటెక్, ఐసీఐసీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, డా. రెడ్డీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్ నష్టాల్లో ఉన్నాయి.

మార్కెట్ ఔట్లుక్ బేరిష్గా ఉందని షేర్ ఇండియా రీసెర్చ్ హెడ్ VP డాక్టర్ రవి సింగ్ అన్నారు. మెటల్, PSU బ్యాంక్, రియల్టీ, బ్యాంక్ స్టాక్ లను పరిశీలించాలని. మరోవైపు ఐటీ, ఇంధనం, ఆటో, ఇన్ఫ్రా, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications