క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఓలా, ఉబెర్లకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించే అంశంలో మెరుగుపడకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. రైడ్ క్యాన్సిల్ విధానంతో పాటు పలు అంశాల్లో క్యాబ్ అగ్రిగేటర్లు అన్యాయమైన బిజినెస్ పద్ధతులను అవలంభిస్తున్నట్లు కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆయా కంపెనీ ప్రతినిధులతో ప్రభుత్వం మంగళవారం భేటీ అయింది. భేటీలో ఓలా, ఉబెర్, మేరు, ర్యాపిడో, జుగ్ను ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ భేటీలో ప్రధానంగా క్యాబ్ సర్వీస్ సంస్థలకు సంబంధించి కార్యకలాపాల నిర్వాహణ, ఫేర్ ప్రైసింగ్ అల్గారిథమ్, డ్రైవర్స్, పేమెంట్స్ స్ట్రెక్చర్స్ వివరాలను వెంటనే అందించాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అత్యవసరంగా పని మీద బయటకు వెళ్లాలంటే మండే ఎండలకు భయపడి ఏసీ ఆన్ చేస్తే, ఛార్జీల మోత మోగిస్తున్నారని, అడిగేవారులేక, నియంత్రించే మార్గం లేకపోవడంతో సంస్థలు ప్రయాణీకుల నుండి ఎక్కువగా వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పీక్ అవర్స్ మాత్రమే కాదని, సాధారణ సమయాల్లో కూడా అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బుకింగ్స్ అంగీకరించిన అనంతరం, డ్రైవర్ల ఒత్తిడితో కస్టమర్లు రైడ్ను రద్దు చేసుకోవడంతో ఈ ఛార్జీని కస్టమర్లు భరించాల్సి వస్తోందని తమ దృష్టికి వచ్చిందని ఈ భేటీ సందర్భంగా చెప్పారు. కస్టమర్ల నుండి ఫిర్యాదులు పెరుగుతున్నాయని, ఇందుకు సంబంధించిన గణాంకాలను కూడా ఇచ్చామని, ఆయా సంస్థలు తమ వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలని కోరామని, అలా జరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కస్టమర్ల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications