ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఓలా ఉద్యోగులకు శుభవార్త. వాళ్లకు జాక్ పాట్ లభించనుంది. ఓలా ఉద్యోగులకు ఇచ్చే ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్స్ (ఈసోప్స్) పరిమాణాన్ని మరింత పెంచింది. తాజాగా సుమారు రూ 326 కోట్ల విలువైన షేర్లను అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు కేటాయించనుంది. ఇందుకోసం కొత్తగా 1,53,623 ఈక్విటీ షేర్ల ను జారీ చేయాలనీ నిర్ణయించింది. దీంతో చాలా మంది ఓలా ఉద్యోగులు కొత్తగా లక్షాధికారులు, కోటీశ్వరులు కానున్నారు.
ఎందుకంటే.. ఒక్కో ఓలా షేరు విలువ రూ 21,250 ఉండటం విశేషం. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఇంట్రాకర్ ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది. దేశంలో ఓలా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంది. దేశీయంగా ఏర్పాటయిన ఈ సంస్థ... అమెరికా స్టార్టుప్ దిగ్గజం ఉబెర్ కు గట్టి పోటీ ఇస్తోంది. ఇటు ఇండియా లోనే కాకుండా లండన్ సహా ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ ఓలా తన సేవలను ప్రారంభించి నువ్వా... నేనా అనేలా ఉబెర్ తో పోటీ పడుతోంది.

దిగ్గజాల సరసన ఓలా ...
ఇండియా లో ఏర్పాటై... విజవంతంగా నడుస్తున్న స్టార్టుప్ కంపెనీలు తమ ఉద్యోగులను కాపాడుకునేందుకు ఈసోప్స్ జారీ చేస్తుంటాయి. తద్వారా కంపెనీలో తాము కూడా భాగస్వాములమే నన్న అంకిత భావం ఉద్యోగుల్లో నెలకొంటుంది. దీంతో స్టార్టుప్ కంపెనీల్లో వచ్చే అనిశ్చిత పరిస్థితుల్లోనూ కట్టుబడి పనిచేస్తారని కంపెనీల ఆలోచన. అందుకే పెద్ద కంపెనీలు మాత్రమే చేయగలిగే ఈ షేర్ల కేటాయింపును స్టార్టుప్ కంపెనీలు కూడా ఫాలో అవుతున్నాయి. ఇప్పటికే బైజూస్, అన్-అకాడమీ, రివిగో, కార్ దేఖో, పేటీఎం, రాజోర్ పే, మీషో, జెరోధా, బౌన్స్ వంటి స్టార్టుప్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈసోప్స్ కేటాయించాయి. ఓలా కూడా ఇప్పటికే తన ఉద్యోగులకు ఈసోప్స్ కేటాయించి వాటిని 2018 లో విక్రయించుకునే అవకాశం కూడా కల్పించింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా మరో రూ 326 కోట్ల విలువైన ఈసోప్స్ జారీ చేయటం విశేషం.

ఐపీవో కోసమేనా...
ఓలా మరికొన్ని రోజుల్లో ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) కు వెళ్లాలని భావిస్తోంది. ఉద్యోగులకు అంత పెద్ద స్థాయిలో ఈసోప్స్ కేటాయించటం కూడా ఒక వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరో 18 నెలల్లోనే ఐపీవో కు రానుందని మార్కెట్ వర్గాల సమాచారం. అందులో భాగంగానే ఓలా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడిందని చెబుతున్నారు. అందుకోసం ఇప్పటికే 1,000 మంది ఉద్యోగులకు స్వస్తి పలికింది. ఇందులో పై స్థాయి ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్వెస్టర్ల నుంచి కాష్ బర్న్ రేటు తగ్గించుకోవాలని ఎప్పటినుంచో ఓలా పై ఒత్తిడి వస్తోంది. అందుకు అనుగుణంగానే కంపెనీ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

కొత్త నిబంధనలు...
ఇటీవల 2020 బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.... ఈసోప్స్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన కొత్త నిర్ణయాలు ప్రకటించారు. అందులో ఉద్యోగులకు కేటాయించే సోప్స్ విక్రయంపై పన్ను వాయిదా వేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఉద్యోగులకు ఈసోప్స్ కేటాయించిన వెంటనే పన్ను చెల్లించే బదులు... వాటిని విక్రయించినప్పుడు మాత్రమే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం గరిష్టంగా 5 సంవత్సరాల వరకు గడువు కూడా ఇచ్చింది. ఈ లోగా ఉద్యోగి వాటిని విక్రయించినా... లేదా కంపెనీ నుంచి వైదొలిగినా ... ఇందులో ఏది ముందు అయితే అప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొత్త వారు స్టార్టప్ కంపెనీల్లో చేరి వారి సేవలను అందించేందుకు మార్గం సుగమం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications