2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సంగీతా సింగ్ తెలిపారు. 2020-21లో 6.9 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలైతే గత ఆర్థిక సంవత్సరంలో 7.14 కోట్లకు పెరిగాయన్నారు.
ప్రాథమిక ట్యాక్స్ పేయర్స్, రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేసే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు పంజుకుంటున్నాయనేందుకు ఇది నిదర్శనం అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నందున పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయని తెలిపారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు వస్తు, సేవల క్రయవిక్రయాలు పెరుగుతాయన్నారు.

FY22లో ట్యాక్స్ కలెక్షన్లు మొత్తం రూ.14 లక్షల కోట్లు నమోదయ్యాయని, FY20తో పోలిస్తే ఇది చాలా బాగుందని తెలిపారు. డిజిటల్ ఇండియా నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు, ఇన్షియేటివ్ మేరకు పన్ను చెల్లింపుల్లో వృద్ధి రేటు చూడవచ్చునని సంగీతా సింగ్ తెలిపారు. కరోనా సమయంలో ప్రజల డిజిటల్ చెల్లింపులు పెరిగాయన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications