ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు.. వారే పెన్షన్ స్కీం ఎంచుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వంలో విలీనమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఏ తరహా పెన్షన్ అవసరమో వారే ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పెన్షన్ను ఎంచుకునే వెసులుబాటును ఉద్యోగులకే ఇవ్వాలి రీజినల్ మేనేజర్లకు ఎండీ నుంచి ఆదేశాలు ఉన్నాయి.
విలీనం అనంతరం ఉద్యోగులకు ఏ నిబంధనలు వర్తిస్తాయి, జీతాల చెల్లింపులు వంటి ఆదేశాలు అందులో ఉన్నాయి. ఇందులో పెన్షన్ల అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు అమలు అవుతున్న ఈపీఎఫ్ఓ 95 కొనసాగుతుందని, ఇందులో ఉంటారా లేదా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న సీపీఎస్లోకి మారుతారా అనే విషయంలో ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.
జనవరి 1 నుంచి అన్ని సేవలు గ్రామసచివాలయాల్లో: మినిమం ఛార్జ్
అయితే పాత పెన్షన్ విధానమే ఆర్టీసీ ఉద్యోగులకు సరైనదని, దీంతో ఉద్యోగ భద్రత ఉంటుందని, ఇప్పుడు ఎంపిక అని చెప్పడం సరికాదనే వాదనలు కూడా ఉన్నాయి. ఉద్యోగులకు పెన్షన్ను ఎంచుకునే అవకాశం కల్పించడం కూడా సరైనదేనని కూడా అంటున్నారు.