ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించేదిలేదు! ITR దాఖలు చేయలేదు.. వెంటనే చేయండి
ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR) దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ చివరి గడువు. మరో ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. గురువారం వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచాలని కోరుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించి వాణిజ్య శాఖ మాజీ మంత్రి సురేష్ ప్రభు కూడా లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఐటీ రిటర్న్స్ గడువును మరోసారి పొడిగించే ఆలోచన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లేదని తెలుస్తోంది.
2020-21 అసెస్మెంట్ అంచనాలు సహా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్న గడువును పొడిగించాలన్న విజ్ఞప్తులను నిర్మల సానుకూలంగా లేరని తెలుస్తోంది.
ప్రో-గవర్నమెంట్ వర్తకుల నుండి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ జీఎస్టీలో ఒక శాతం పన్నును నగదు రూపంలో చెల్లించాలనే నిర్ణయాన్ని కూడా వాయిదా వేయడానికి సిద్ధంగా లేదు. వీటిని వాయిదా వేయాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. డిసెంబర్ 31వ తేదీలోపు రిటర్న్స్ సమర్పించాలని కోరుతూ ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా ఈ రోజు ట్వీట్ చేసింది.