సాఫ్టుబ్యాంక్, ఫేస్బుక్ పెట్టుబడులు కలిగిన ఈ-కామర్స్ దిగ్గజం మీషో తమ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. కరోనా కారణంగా ఇప్పటికే ఐటీ రంగం మొదలు అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఒమిక్రాన్కు ముందు జనవరి నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రారంభించాలని పలు సంస్థలు భావించాయి. కానీ అంతలోనే ఒమిక్రాన్ ప్రభావం చూపింది. దీంతో ఐటీ సహా అన్ని రంగాల్లోని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ను కొనసాగించాయి. అయితే తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం మీషో తమ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది.
ఇంటి నుండి లేదా ఆఫీస్కు లేదంటే తమకు ఇష్టం వచ్చిన చోటు నుండి పని చేసేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పించింది. ఇది కొద్ది రోజుల కోసం ప్రకటించిన విధానం కాదని, ఉద్యోగులు శాశ్వతంగా తమ ఎంపిక మేరకు పని చేయవచ్చునని పేర్కొంది. బెంగళూరులో సంస్థకు హెడ్ ఆఫీస్ ఉంది. అయితే ఉద్యోగులు తమకు ఇష్టం వచ్చిన చోటు నుండి పని చేయవచ్చు. ఉద్యోగుల డిమాండ్ ఆధారంగా, అధిక టాలెంట్ డెన్సిటీ ఉన్న ప్రదేశాల్లో శాటిలైట్ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయనుంది. అంటే దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల్లో కార్యాలయాలను తెరిచే ఉద్దేశ్యంలో ఉంది.

భవిష్యత్తు పని విధానాలకు సంబంధించి అనేక నమూనాలు తాము అధ్యయనం చేశామని, మీషోతో అంతర్జాతీయంగా ఉన్న ప్రతిభావంతులకు మంచి అవకాశాలు లభిస్తాయని మీషో సీహెచ్ఆర్ఓ ఆశిష్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థలో 1700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందరికీ కొత్త విధానాన్ని అమలు చేస్తామని, మీషో హెడ్ ఆఫీస్కు అధికారిక ప్రయాణాల కోసం వచ్చే వర్కింగ్ పేరెంట్స్కు మద్దతుగా వారి ఆరేళ్లలోప పిల్ల కోసం మీషో డే-కేర్ సదుపాయాలు కూడా కల్పిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications