కరోనా మహమ్మారిపై పోరుకు కార్పోరేట్ దిగ్గజాలు పీఎం కేర్స్ ఫండ్కు పెద్ద మొత్తంలో నిధులు అందిస్తున్నాయి. అంతేకాదు, తమకు సాధ్యమైన మేరకు వెంటిలెటర్స్ తయారీ, మాస్కుల పంపిణీ, మెడికల్, ఎమర్జెన్సీ సేవల కోసం అవసరమైతే తమ వాహనాలు అందించడం, రిలయన్స్ వంటి సంస్థ కరోనా ఆసుపత్రి నిర్మాణం.. ఇలా వివిధ రూపాల్లో సహకరిస్తున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా లాజిస్టిక్స్ ఉచిత క్యాబ్ సేవలు ప్రారంభించింది.

హైదరాబాద్లో మహీంద్ర క్యాబ్స్
మహీంద్ర లాజిస్టిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో కరోనా పేషెంట్ల కోసం ఉచిత అత్యవసర క్యాబ్ సేవల్ని ప్రారంభించింది. రాచకొండ కమిషనరేట్ సహకారంతో హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి, రాచకొండ కమిషనరేట్ పరిధిల్లో ఈ సర్వీసుల్ని మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ క్యాబ్స్ 24 గంటలు నడుస్తాయని సంస్థ ఎండీ, సీఈవో రాంప్రవీణ్ స్వామినాథన్ వెల్లడించారు.

హీరో మోటో కార్ప్ పొడిగింపు
మార్చి 21 నుండి ఏప్రిల్ 30వ తేదీ మధ్య గడువు ముగిసే ఉచిత సర్వీస్ను 2020 జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు హీరో మోటో కార్ప్ తెలిపింది. లాక్ డౌన్ సమయం ముగిసే వారంటీ గడువును కూడా జూన్ 30వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

పీఎం కేర్స్ ఫండ్కు నిధులు
ఇదిలా ఉండగా, పీఎం కేర్స్ ఫండ్కు డాబుర్ ఇండియా రూ.11 కోట్లు అందించింది. రూ.10 కోట్లతో దేశవ్యాప్తంగా పోలీసులకు ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, అత్యవసర మెడిసిన్స్ అందించేందుకు, వలస కార్మికులకు రోజుకు 2500 మందికి భోజనానికి వినియోగిస్తామని తెలిపింది.
జేఎం ఫైనాన్షియల్ రూ.15 కోట్లు పీఎం కేర్స్ ఫండ్కు అందిస్తానని తెలిపింది. మరో రూ.15 కోట్లతో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది.
కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, అత్యవసర సేవల సిబ్బంది రక్షణ కోసం ఫేస్ షీల్డులను తమ చెన్నై, సనంద్ ప్లాంట్స్లలో తయారు చేస్తామని ఫోర్డ్ ఇండియా ప్రకటించింది.

HDFC బ్యాంకు ద్వారా విరాళాలు ఇవ్వొచ్చు
కరోనా కట్టడికి ఆర్థిక సాయం చేయానుకునే వారి కోసం పీఎమ్ కేర్స్ ఫండ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ నిధి కోసం విరాళాలు సేకరించేందుకు తమకు అనుమతి లభించిందని HDFC బ్యాంక్ పేర్కొంది. పీఎమ్ కేర్స్ నిధికి విరాళం ఇవ్వాలనుకున్నవారు తమ బ్యాంకు వెబ్సైట్ ద్వారా డొనేషన్లు ఇవ్వవచ్చునని తెలిపింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐల ద్వారా విరాళాలు చెల్లించేందుకు సంస్థ వెబ్సైట్లో అవకాశముందని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications