గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. పెట్రోల్ ధరలపై ఊరటగా ఉన్న సామాన్యుడికి దేశీయ పెట్రోలియం కంపెనీలు షాకిచ్చాయి. డొమెస్టికి ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. నాన్-సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పైన ధరను రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.834.50 నుండి రూ.859.5కి పెరిగింది. అంతకుముందు జూలై 1వ తేదీన సిలిండర్ ధరలు పెరిగాయి. నాడు సిలిండర్ పైన రూ.25.50 పెరిగింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.834.50 నుండి రూ.859.5కి, కోల్కతాలో రూ.861 నుండి రూ.886కి, చెన్నైలో రూ.850.50 నుండి రూ.875.50కి, లక్నోలో రూ.897.5, అహ్మదాబాద్లో రూ.866.50కు పెరిగింది. హైదరాబాద్లో సిలిండర్ ధర రూ.887 నుండి రూ.912కు పెరిగింది. కొచ్చిలో గ్యాస్ సిలిండర్ ధర రూ.866కు, తిరువనంతపురంలో రూ.869కి చేరుకుంది.

సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన చమురు రంగ కంపెనీలు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ సవరణ ఉంటుంది. అయితే 2021 ప్రారంభంలో అంటే ఈ జనవరిలో ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.694గా ఉండగా, ఫిబ్రవరి నాటికి రూ.719కి పెరిగింది. ఫిబ్రవరి 15వ తేదీన మరోసారి పెరిగి రూ.769కి, ఫిబ్రవరి 25న పెరిగి రూ.794కు, పెరిగింది. మార్చి నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.819కి పెరగగా, ఏప్రిల్ నెలలో రూ.10 తగ్గి రూ.809కు తగ్గింది. ఈ ఏడాది ఎల్పీజీ సిలిండర్ ధర రూ.165.50 పెరిగింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications