ఆర్థిక మాంద్యం భయాలు, పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడానికి పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. మెటా, ట్విటర్, మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకోగా.. తాజాగా అమెరికన్ టెక్నాలజీ, ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ తన ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతవారం హైరింగ్ ప్రక్రియకు బ్రేక్ వేయనున్నట్టు అంతర్గత మెమోలో ప్రకటించిన అమెజాన్ ఉద్యోగులను తొలగించడంపై దృష్టి సారించింది.

3,766 మంది ఉద్యోగులు
అమెజాన్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ జామీ జాంగ్ లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ పెట్టింది. తనను కంపెనీ నుంచి తొలగించినట్లు తెలిపారు. అంతేకాదు రోబోటిక్స్ టీమ్ మొత్తానికి పింక్ స్లిప్లు అందజేశారని మాజీ ఉద్యోగి పోస్ట్లో పేర్కొన్నారు. లింక్డ్ఇన్ డేటా ప్రకారం, కంపెనీ రోబోటిక్స్ విభాగంలో కనీసం 3,766 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 3,766 మంది ఉద్యోగులలో ఎంతమందిని తొలగిస్తారో తెలియదు.

వాల్ స్ట్రీట్ జర్నల్
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, కంపెనీ లాభాల్లో లేని యూనిట్లలో పని చేస్తున్న సిబ్బందిని వేరే చోట ఉద్యోగాలు చూసుకోవాలని చెప్పినట్లు తెలుస్తుంది. "గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎంత మంది వ్యక్తులను నియమించుకున్నాము, ఆర్థిక వ్యవస్థ అనిశ్చిత ప్రదేశంలో ఉన్నందున కొత్త ఇంక్రిమెంటల్ హైర్లను పాజ్ చేయాలని ఈ వారం నిర్ణయించుకున్నట్లు కంపెనీలో పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెట్టీ మెమోలో పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ
ఉద్యోగ రిక్రూట్ మెంట్ రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు."రాబోయే కొన్ని నెలల పాటు ఈ పాజ్ని ఉంచాలని నిర్ణయించుకున్నాం.ఆర్థిక వ్యవస్థలో మనం చూస్తున్న వాటిని పర్యవేక్షించడం కొనసాగిస్తాము " అని మెమో పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications