Success Story: వ్యాపార నిర్ణయాలకు పేరుగాంచిన అజయ్ పిరమల్, పిరమల్ గ్రూప్ ఛైర్మన్ గా ఉన్నాయి. ఆయన గత 4 దశాబ్దాల్లో తన సమూహాన్ని వేరే ఎత్తుకు తీసుకెళ్లారు. 1980 చివరి నుంచి టెక్స్టైల్ అండ్ మెషిన్ టూల్ కంపెనీని నడుపుతున్నాడు. ఈ పని అజయ్ పిరమల్ తన తండ్రి నుంచి వారసత్వంగా పొందారు. మరి అజయ్ పిరమల్ సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తండ్రి నుంచి కంపెనీ బాధ్యతలు..
అజయ్ పిరమల్ ఆధీనంలోని పిరమల్ ఎంటర్ప్రైజెస్ రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్, గ్లాస్ ప్యాకేజింగ్ రంగాల్లో పనిచేస్తుంది. వీరి వ్యాపారాల విలువ 4 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోని దాదాపు 30 దేశాల్లో పిరమల్ గ్రూప్ కార్యాలయాలున్నాయి.

MBA పూర్తయ్యాక..
జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ నుంచి MBA పూర్తిచేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత అజయ్ పిరమల్ కుటుంబ వ్యాపార బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత తండ్రి కొనుగోలు చేసిన మిరాండా టూల్స్ బాధ్యతనంతా అజయ్ పిరమల్కు అప్పగించారు. ఫార్మా రంగంలోకి రాకముందు.. అజయ్ టెక్స్టైల్ వ్యాపారాన్ని కూడా కొనసాగించాలని ప్రయత్నించారు. అయితే నిరాశతో ఫార్మా రంగం వైపు మళ్లారు.

పెరిగిన సంపద..
2010లో ఫార్మాస్యూటికల్ కంపెనీ నికోలస్ పిరమల్ను.. అజయ్ పిరమల్ ప్రసిద్ధ ఫార్మా కంపెనీ అయిన అబాట్కు విక్రయించారు. ఈ విక్రయం దాదాపు 30 రెట్లు లాభానికి జరిగింది. ఈ కంపెనీని విక్రయించాలనే నిర్ణయంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే ఈ నిర్ణయం వల్ల పిరమల్ వ్యక్తిగత సంపద 1.6 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.

వోడాఫోన్ నుంచి సంపద..
ఒకప్పుడు అజయ్ పిరమల్ వోడాఫోన్ ద్వారా భారీ మొత్తాన్ని సంపాదించారు. 2014లో వోడాఫోన్ ఇండియా లిమిటెడ్ తన షేర్లన్నింటినీ ప్రైమ్ మెటల్ లిమిటెడ్కు రూ. 8,900 కోట్లకు విక్రయించారు.


Click it and Unblock the Notifications