November 1st Rules: నవంబర్ 1, 2022 నుంచి చాలా విషయాల్లో రూల్స్ మారుతున్నాయి. అవి ఇన్సూరెన్స్, గ్యాస్ నుంచి పీఎం కిసాన్, విద్యుత్ సబ్సిడీ వరకు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తప్పకు తెలుసుకుని ముందుగా లబ్ధిదారులు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెల ప్రారంభంలో 8 అంశాల్లో రానున్న కొత్త మార్పుల గురించి ఇప్పుడు గమనిద్దాం.

ఇన్సూరెన్స్ KYC తప్పనిసరి..
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ IRDA తాజా నిబంధనల ప్రకారం.. నాన్ లైఫ్ ఇన్సూరెనస్ పాలసీలను కొనుగోలు చేసేందుకు KYC తప్పనిసరి. గతంలో ఇది ఆఫ్షనల్ గా ఉంది. అయితే రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు ఇది తప్పనిసరి. కానీ మారిన రూల్స్ ప్రకారం నవంబర్ 1, 2022 నుంచి ఇది అందరికీ తప్పనిసరి కానుంది.

LPG- OTP రూల్స్..
ప్రతి నెల మెుదటి తారీఖున ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు మారుతుంటాయి. డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ విషయంలో చమురు కంపెనీలు మార్పులు చేస్తుంటాయి. అయితే తాజాగా నవంబర్ 1 నుంచి LPG సిలిండర్ను బుక్ చేసిన తర్వాత.. రిజిస్టర్డ్ మొబైల్కు OTP వస్తుంది. సిలిండర్ డెలివరీ సమయంలో ఈ OTPని తప్పక తెలపాల్సి ఉంటుంది. గ్యాస్ డీలర్లు చేస్తున్న అవకతవకలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ రూల్ ప్రవేశపెట్టింది.

పీఎం కిసాన్ రూల్స్..
పీఎం కిసాన్ యోజన 12వ విడత కోసం డబ్బు పంపడానికి ముందు పెద్ద మార్పు చేయబడింది. ప్రస్తుతం లబ్ధిదారులైన రైతులు పోర్టల్ను సందర్శించడం ద్వారా ఆధార్ నంబర్ ఉపయోగించి స్థితిని తనిఖీ చేయలేరు. ఇందుకోసం వారు ఇకపై రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను ఇవ్వవలసి ఉంటుంది. గతంలో రెండింటినీ వినియోగించే వెసులుబాటు ఉండేది.

GST రిటర్న్ మార్పు..
జీఎస్టీ రిటర్న్స్లో మార్పులు వచ్చాయి. తాజా నిబంధనల ప్రకారం రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్న్లో నాలుగు అంకెల HSN కోడ్ను నమోదు చేయడం తప్పనిసరి. గతంలో ఏప్రిల్ 1 నుంచి రూ.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారాలకు ఇది తప్పనిసరి చేయబడింది. ఆ తర్వాత వారికి ఆగస్టు 1 నుంచి ఆరు అంకెల కోడ్ను నమోదు చేయటం తప్పనిసరి అయింది.

ఢిల్లీలో మారిన రూల్స్..
ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీపై కొత్త నిబంధన అమలులోకి వస్తోంది. దీని ప్రకారం ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందేందుకు సబ్సిడీ కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది. దీనిని పూర్తి చేయని వారికి నవంబర్ 1 నుంచి సబ్సిడీ నిలిచిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనికి తోడు ఎయిమ్స్లోని రోగుల నుంచి వసూలు చేస్తున్న రూ.300 యుటిలిటీ ఛార్జీలను రద్దు చేస్తున్నారు. ఎయిమ్స్లోని ఏదైనా విభాగంలో తయారు చేసిన కొత్త OPD కార్డును పొందడానికి రూ.10 రుసుమును కూడా తొలగించాలని నిర్ణయించారు.

ఆకాశ విమానాలు..
నవంబర్ నుంచి ఆకాశ విమానాల్లో ప్రయాణించే వారు తమ పెంపుడు జంతువులను కూడా విమానంలో తీసుకెళ్లవచ్చని కంపెనీ గతంలోనే ప్రకటించింది. దీంతో పాటు నవంబర్ నుంచి కార్గో సర్వీసులను కూడా కంపెనీ ప్రారంభించనుంది.

రైలు షెడ్యూల్ మార్పు..
నవంబర్ 1 నుంచి రైలు షెడ్యూల్లో కూడా మార్పులు వస్తున్నాయి. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైళ్ల టైమ్ టేబుల్ను మార్చబోతోంది. దీనికింద 13,000 ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్ల టైమింగ్స్ మారిపోతున్నాయి. కాబట్టి మారుతున్న ప్రయాణ వివరాలను ప్రజలు తెలుసుకోవటం వారి ప్రయాణాన్ని సులభతరం చేయటంలో ఉపయోగపడుతుంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications