కరోనా కారణంగా భారత ఐటీ కంపెనీల ఆదాయాలు, వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం పడనుందని క్రిసిల్ సహా వివిధ రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. కరోనా కారణంగా ఆదాయాలు ఈసారి దశాబ్ద కనిష్టస్థాయి 2 శాతం, అంతకంటే దిగువకు పడిపోవచ్చునని, లాభదాయకత కూడా తగ్గుతుందని క్రిసిల్ వెల్లడించింది. లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీలు కొత్త డీల్స్ కోల్పోవడంతో పాటు ప్రస్తుత డీల్స్ పైన విదేశీ క్లయింట్లతో తిరిగి చర్చించే అవకాశం లేకపోవడం వల్ల అవి కూడా నష్టపోయే ప్రమాదముంటుందని తెలిపింది.

రూ.7.28 లక్షల పరిమాణం, 40 లక్షల ఉద్యోగాలు
దేశంలో ఐటీ రంగం పరిమాణం 9,700 కోట్ల డాలర్లు లేదా రూ.7.28 లక్షల కోట్లు. దేశంలోనే అతి పెద్ద సేవల ఎగుమతుల విభాగాల్లో అగ్రస్థానంలో ఉంది. ఐటి ఆధారిత రంగాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ విభాగంలో 40 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 2008-09 సంక్షోభం అనంతరం గత కొన్నేళ్లుగా రెండెకల వృద్ధి నమోదు చేసుకుంటున్న సంస్థలపై కరోనా ప్రభావం భారీగా ఉండనుంది.

క్లయింట్స్తో సంప్రదింపులకు ఇబ్బందులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఆదాయ, లాభాలు పదేళ్ల కనిష్ఠానికి పడిపోనున్నాయని క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. లాక్ డౌన్, ప్రపంచవ్యాప్తంగా ప్రజా జీవనం స్తంభించడంతో ఐటీ సంస్థలు నూతన ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతున్నాయని, దీంతో భవిష్యత్తు ఆదాయ, లాభాలు 0-2% వరకు పడిపోవచ్చునని తెలిపింది. లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో ఉన్న క్లయింట్స్తో తిరిగి సంప్రదింపులు జరిపేందుకు ఆయా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పేర్కొంది.

వర్క్ ఫ్రమ్ హోమ్
లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆలోచిస్తున్నాయి. తద్వారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేయనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వినియోగ రేటు 85 శాతం నుండి 90 శాతానికి పెరిగింది. దేశంలో 70 శాతం వాటా కలిగిన 15 పెద్ద ఐటీ కంపెనీల అధ్యయనం ఆధారంగా క్రిసిల్ ఈ అంచనాలు తయారు చేసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications