కరోనా కారణంగా భారత ఐటీ కంపెనీల ఆదాయాలు, వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం పడనుందని క్రిసిల్ సహా వివిధ రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. కరోనా కారణంగా ఆదాయాలు ఈసారి దశాబ్ద కనిష్టస్థాయి 2 శాతం, అంతకంటే దిగువకు పడిపోవచ్చునని, లాభదాయకత కూడా తగ్గుతుందని క్రిసిల్ వెల్లడించింది. లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీలు కొత్త డీల్స్ కోల్పోవడంతో పాటు ప్రస్తుత డీల్స్ పైన విదేశీ క్లయింట్లతో తిరిగి చర్చించే అవకాశం లేకపోవడం వల్ల అవి కూడా నష్టపోయే ప్రమాదముంటుందని తెలిపింది.

రూ.7.28 లక్షల పరిమాణం, 40 లక్షల ఉద్యోగాలు
దేశంలో ఐటీ రంగం పరిమాణం 9,700 కోట్ల డాలర్లు లేదా రూ.7.28 లక్షల కోట్లు. దేశంలోనే అతి పెద్ద సేవల ఎగుమతుల విభాగాల్లో అగ్రస్థానంలో ఉంది. ఐటి ఆధారిత రంగాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ విభాగంలో 40 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 2008-09 సంక్షోభం అనంతరం గత కొన్నేళ్లుగా రెండెకల వృద్ధి నమోదు చేసుకుంటున్న సంస్థలపై కరోనా ప్రభావం భారీగా ఉండనుంది.

క్లయింట్స్తో సంప్రదింపులకు ఇబ్బందులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఆదాయ, లాభాలు పదేళ్ల కనిష్ఠానికి పడిపోనున్నాయని క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. లాక్ డౌన్, ప్రపంచవ్యాప్తంగా ప్రజా జీవనం స్తంభించడంతో ఐటీ సంస్థలు నూతన ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతున్నాయని, దీంతో భవిష్యత్తు ఆదాయ, లాభాలు 0-2% వరకు పడిపోవచ్చునని తెలిపింది. లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో ఉన్న క్లయింట్స్తో తిరిగి సంప్రదింపులు జరిపేందుకు ఆయా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పేర్కొంది.

వర్క్ ఫ్రమ్ హోమ్
లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆలోచిస్తున్నాయి. తద్వారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేయనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వినియోగ రేటు 85 శాతం నుండి 90 శాతానికి పెరిగింది. దేశంలో 70 శాతం వాటా కలిగిన 15 పెద్ద ఐటీ కంపెనీల అధ్యయనం ఆధారంగా క్రిసిల్ ఈ అంచనాలు తయారు చేసింది.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications