Wipro: ఐటీ పరిశ్రమలో టాప్ కంపెనీల్లో విప్రో కూడా ఒకటిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐటీ రంగంలోని కంపెనీలు ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో కంపెనీ మూడో త్రైమాసికానికి సంబంధించి తన ఉద్యోగులకు వేరియబుల్ పే గురించి కీలక ప్రకటన చేసింది.

వేరియబుల్ పే అంటే..
ఐటీ పరిశ్రమలో కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాన్ని రెండు భాగాలుగా చెల్లిస్తుంటాయి. ఒకటి నెలవారీ చెల్లించే ఫిక్స్డ్ వేతనం కాగా.. మరొకటి త్రైమాసికానికి ఒకసారి కంపెనీ పనితీరు ఆధారంగా చెల్లించేది. దీనినే వేరియబుల్ పే అని పిలుస్తారు. ఇది ఒక్కో కంపెనీలో ఒక్కోలాగా ఉంటుంది. అయితే కంపెనీ పనితీరును బట్టి ఏ క్యాటగిరీలోని ఉద్యోగులకు దీనిని ఎంతమేర చెల్లించాలనే నిర్ణయాన్ని కంపెనీలు ప్రతి త్రైమాసికంలోనూ ప్రకటిస్తుంటాయి. టెక్కీలు సైతం వీటికోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటాయి.

వేరియబుల్ వేతనం..
విప్రోలో డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి వేరియబుల్ పే ఫిబ్రవరి నెల జీతంతో విడుదల చేయాలని టెక్ దిగ్గజం నిర్ణయించిందని సమాచారం. దేశీయ ఐటి మేజర్ 2022-23 డిసెంబర్ ముగిసిన త్రైమాసికంలో A నుంచి B3 బ్యాండ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు 87 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించనుందని కంపెనీ ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈ-మెయిల్ లో వెల్లడించిందని తెలుస్తోంది. ఉద్యోగుల వేరియబుల్ వేతనం కంపెనీ పనితీరుతో పాటు ఉద్యోగులు పని చేస్తున్న వ్యాపార యూనిట్ పనితీరుపై ఆధారపడి ఉంటుందని అందులో తెలిపింది.

కంపెనీ ఆదాయం..
FY2022-23కి సంబంధించి డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 14.3 శాతం పెరిగి రూ.23,229 కోట్లకు చేరినట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో తెలిపింది. IT సేవల నుంచి విప్రో ఆదాయం ఏడాది ప్రాతిపధికన 10.4 శాతం పెరిగింది. ఈ క్రమంలో ఆపరేటింగ్ మార్జిన్ వరుసగా 120 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 16.3 శాతానికి చేరుకుంది.

సీఈవో ఏమన్నారంటే..
క్లయింట్ సంబంధాలు, అధిక విన్ రేట్ల ఫలితంగా మార్కెట్ వాటాను పొందడాన్ని కొనసాగిస్తున్నట్లు CEO, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే అన్నారు. మునుపటి త్రైమాసికంలో కంపెనీ A నుంచి B3 బ్యాండ్ ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పేని చెల్లించింది. అయితే విప్రో ప్రత్యర్థులను గమనిస్తే.. TCS డిసెంబర్ త్రైమాసికంలో 70 శాతం మంది ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించనున్నట్లు ప్రకటించింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications