బెంగళూరు: ఆర్థిక మందగమనం కారణంగా ఇటీవలి వరకు ఆటో పరిశ్రమ, ఎఫ్ఎంసీజీలో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా, ఐటీ రంగ నిపుణులు మోహన్దాస్ పాయ్ మరో షాకింగ్ విషయం చెప్పారు. ప్రస్తుతం భారత ఐటీ రంగంలో వృద్ధి నెమ్మదించిందని, అది మిడిల్ లెవల్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో ఐటీ కంపెనీలు దాదాపు 30వేల నుంచి 40 వేల మంది మధ్యశ్రేణి ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు బ్యాడ్ న్యూస్, ఒంటి చేత్తో జగన్ ధ్వంసం: ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్

అలాంటి వారిని తొలగించేందుకు మొగ్గు
ఇతర దేశాల్లో వలే భారత్లోని ఐటీ కంపెనీలు కూడా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తాయని మోహన్దాస్ పాయ్ అన్నారు. మంచి వృద్ధి నమోదు చేసినప్పుడు ప్రమోషన్లు సహజమేనని చెప్పారు. అయితే వృద్ధి తగ్గినప్పుడు మాత్రం ఆ ప్రభావం ఎక్కువగా మిడిల్ లెవల్ ఉద్యోగులపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అలాంటి ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతాయన్నారు.

ఊరట.. ఇతర రంగాల్లో వారికి ఉద్యోగాలు
దాదాపు ప్రతి అయిదేళ్లకు ఓసారి ఇలాంటివి జరుగుతుంటాయని మోహన్దాస్ పాయ్ చెప్పారు. అయిదేళ్లకు ఓసారి ఇలాంటి ఉద్యోగాల కోతలు ఉంటాయని చెప్పారు. అయితే కాస్త మరో ఊరట కలిగించే విషయం కూడా ఆయన చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయే వారిలో 80 శాతం మందికి ఇతర రంగాల్లో మళ్లీ ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు. నైపుణ్యం ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు. ప్రస్తుత కాలంలో ఎన్నో కొత్త కొత్త సెక్టార్లు పుట్టుకు వస్తున్నాయని, వాటిల్లో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

నైపుణ్యం ఉంటే రాణించవచ్చు...
నైపుణ్యం ఉంటే ఎక్కడైనా రాణించవచ్చునని చెప్పారు. ఎవరైనా అద్భుత పనితీరు కనబరచకుంటే అత్యధిక వేతనానికి అర్హులుగా ఎవరినీ భావించలేమని మోహన్దాస్ పాయ్ అన్నారు. ఐటీ పరిశ్రమ మందగమనంలో ఉన్నందున ఈ పరిశ్రమలో ముప్పై వేల మంది నుంచి నలభై వేల మంది వరకు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications