బెంగళూరు: తరగతి గదుల రూపురేఖలు మరింత మారబోతోన్నాయి. పాఠ్యాంశాల బోధనలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. విద్యార్థులకు ఉపగ్రహ టీవీల పాఠ్యాంశాలను బోధించడానికి రంగం సిద్ధం చేసింది. దేశీయ ఉపగ్రహాలన్నీ ఇస్రో ఆధీనంలో ఉన్నందున.. వాటి సేవలను వినియోగించుకోవడానికి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి- పార్లమెంటరీ ప్యానెల్ అందజేసిన ప్రతిపాదనలకు ఇస్రో అంగీకారం తెలిపింది.
అంతేకాదు- రాష్ట్రాలకు శాటిలైట్ హక్కులను బదలాయించడానికి కూడా ఇస్రో తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో శాటిలైట్ టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమవంతు సహకారం అందిస్తామని ఇస్రో ప్రకటించింది. వాటిని ఎలా వినియోగించాలనే అంశంపై సాంకేతిక సహకారాన్ని సైతం అందించడానికి సిద్ధమని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.

దీనివల్ల వారి విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీనివల్ల వచ్చిన గ్యాప్ను భర్తీ చేయడంలో సహకారం అందిస్తామని ఇస్రో పేర్కొంది. దీనిపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సమాచారం ఇచ్చంది. శాటిలైట్ టీవీల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలనే విషయంపై కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఇస్రో శాస్త్రవేత్తలు, దూరదర్శన్ అధికారులు హాజరయ్యారు.
ఉత్తర ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్లకు చెందిన విద్యాశాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా వారంతా ఒక అవగాహనకు వచ్చారు. టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించంలో తమ ఆధీనంలో ఉన్న శాటిలైట్లను వినియోగించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వాటిని ఎలా వినియోగించాలనే విషయంపై అధికారులకు శిక్షణ కూడా ఇస్తామని, రాష్ట్రాలకు శాటిలైట్ల హక్కులను బదలాయించడానికి కూడా సిద్ధమని అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications