ముంబై: తైవాన్కు ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీ కాంట్రాక్ట్ కంపెనీ ఫాక్స్కాన్.. త్వరలో భారత మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. ఐఫోన్లను తయారు చేసే ఈ సంస్థకు ఇప్పటికే భారత్లో యూనిట్లు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టింది. తాజాగా. అదే రేంజ్లో నిధులను సేకరించడానికి సన్నాహాలు చేపట్టబోతోంది. దీనికోసం పబ్లిక్ ఇష్యూను జారీ చేయబోతోంది. దీనికి అవసరమైన ప్రాథమిక చర్యలను తీసుకుందని, చర్చలనూ ముగించుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
తైపీ ప్రధానకేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఫాక్స్కాన్ భారత స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఇప్పటిదాకా అడుగు పెట్టలేదు. త్వరలోనే ఆ కొరతను తీర్చుకోవడానికి సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను జారీ చేయడ ద్వారా కనీసం 5,000 కోట్ల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఫాక్స్కాన్ సంస్థ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వద్ద బిలియన్ డాలర్ల వ్యయంతో యాపిల్ ఐఫోన్ల తయారీ యూనిట్ను నెలకొల్పబోతోంది. దీనికి కొనసాగింపుగా భారత మార్కెట్లో అడుగు పెట్టడానికి అవసరమైన చర్యలను చేపట్టిందని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నారు.

చైనాపై వ్యతిరేకత మొదలైన తరువాత.. తమ ఉత్పాదక కార్యకలాపాలన్నింటినీ భారత్కు మళ్లించడంలో భాగంగా తమిళనాడులో భారీగా పెట్టుబడులను పెట్టడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందా సంస్థ. ప్రస్తుతం తమిళనాడు, ఏపీల్లో ఫాక్స్కాన్కు రెండు తయారీ యూనిట్లు ఉన్నాయి. యాపిల్, షావోమి స్మార్ట్ఫోన్లకు అవసరమైన విడి భాగాలను ఈ రెండు యూనిట్లలో తయారు చేస్తోంది. ఇదివరకు 2018లో ఫాక్స్కాన్ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఎంట్రీ ఇచ్చింది. పబ్లిక్ ఇష్యూను జారీ చేసింది.
అది విజయవంతం కావడంతో ఇక భారతీయ మార్కెట్పై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఫాక్స్కాన్తో పాటు ఐఫోన్ విడి పరికరాలను తయారు చేసే కాంట్రాక్ట్ను పొందిన విస్ట్రాన్, పెగట్రాన్ కంపెనీలు కూడా వచ్చే అయిదేళ్ల కాల వ్యవధిలో 900 మిలియన్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాశాలను పరిశీలిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనాను బ్రాండ్లకు భారత్, అమెరికా వంటి కొన్ని దేశాల్లో డిమాండ్ తగ్గిపోవడంతో.. అవే తయారీ యూనిట్లను భారత్కు తరలించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకున్నట్లు అభిప్రాయపడుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications