2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.24,100 కోట్ల క్యాపిటల్ రిటర్న్స్ను ఇచ్చింది. వాటాదారులకు ఈ మొత్తాన్ని చెల్లించింది. ఒక్కో షేరుకు రూ.31 డివిడెండ్ (తుది డివిడెండ్ రూ.16, మధ్యంతర డివిడెండ్ రూ.15) చెల్లింపుతో పాటు రూ.11,000 కోట్ల మేర షేర్లను బైబ్యాక్ చేసినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. కంపెనీ 41వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా మాట్లాడారు.
2021-22 అసాధారణ వృద్ధి 19.7 శాతం నమోదైన కారణంగా 16.3 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని, ఇది పదకొండేళ్లలో ఇన్ఫోసిస్కు వేగవంతమైన వృద్ధి అన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.13,000 కోట్ల మేర డివిడెండ్ను ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో రూ.11,000 కోట్ల షేర్ల బైబ్యాక్ను పూర్తి చేసింది. తద్వారా రూ.24,100 కోట్ల మూలధనాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపారు.

తమ క్లయింట్స్కు ఇన్ఫోసిస్ నమ్మకమైనదని, వారిని ముందుకు తీసుకు వెళ్లడానికి మా నైపుణ్యాన్ని వినియోగించే సామర్థ్యం ఉందని నందన్ నీలేకని అన్నారు. FY22లో గత పదకొండు సంవత్సరాల కాలంలో వేగవంతమైన వృద్ధిని సాధించిందన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications