Infosys: రూ.10,000 మొదలైన వ్యాపారం రూ.6.63 లక్షల కోట్లకు చేరుకుంది.. ఇదీ 40 ఏళ్ల ఇన్ఫోసిస్ ప్రస్థానం..


దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒక్కటి. ఈ కంపెనీనిని 1981లో ముంబైలో 10 వేల రూపాయల పెట్టుబడితో ఓ అపార్ట్ మెంట్ లో ఏడుగురు యువ ఇంజనీర్లు ప్రారంభించారు. ప్రస్తుతం కంపెనీ దాదాపు $80 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో పాటు $16 బిలియన్ల కంటే ఎక్కువ ఆదాయం నమోదు చేసింది. ఈ కంపెనీలో 3.35 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

 1981

1981

ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణానికి సంబంధించి ఇన్ఫోసిస్ దిగ్గజ వ్యవస్థాపకుడు NR నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి పలు విషయాలను గుర్తు చేసుకున్నారు. 1981 నాటి ఆ గజిబిజి చిత్రాన్ని 2022లో ఈ అందమైన చిత్రంగా మార్చడంలో ఇంత ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రతి ఇన్ఫోసియన్స్, ఎక్స్-ఇన్ఫోసియన్‌లకు ధన్యవాదలు తెలుపుతున్నట్లు నారాయణ మూర్తి తెలిపారు.

ముంబై

ముంబై

ముంబైలోని నా వన్-బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో మొదటి రోజు నుంచి మేము ఏడుగురం కూర్చున్నామని చెప్పారు. మూడు గంటల సుదీర్ఘ చర్చ తర్వాత మేము ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చామని వివరించారు. అలా ఇన్ఫోసిస్ కంపెనీ పురుడు పోసుకుందని నారాయణ మూర్తి వివరించారు. అప్పుడు తాను ఇచ్చిన రూ. 10,000 తర్వాత బిలియన్ డాలర్లు అవుతుందని కలలో కూడా ఊహించలేదు సుధా మూర్తి అన్నారు.

మెగా ఈవెంట్‌

మెగా ఈవెంట్‌

ఇన్ఫోసిస్ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం, బుధవారం నాడు మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో తన కీలకమైన టెక్నాలజీలను ప్రదర్శనకు ఉంచింది ఇన్ఫోసిస్. ఇందులో డిజిటల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందించే క్లౌడ్ సర్వీసెస్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 'కోబాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌', సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పామ్ 'సైబర్ నెక్స్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌', డేటా ఎనలిటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 'టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌', ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం తీసుకొచ్చిన డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 'లీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌' ఉన్నాయి.

ప్యాట్నీ కంప్యూటర్‌ సిస్టమ్స్‌

ప్యాట్నీ కంప్యూటర్‌ సిస్టమ్స్‌

1981లో ప్యాట్నీ కంప్యూటర్‌ సిస్టమ్స్‌ లో పని చేస్తున్న ఎన్‌.ఆర్‌. నారాయణ మూర్తి, నందన్‌ నీలేకని, ఎన్‌.ఎస్‌.రాఘవన్‌, ఎస్‌.గోపాలకృష్ణన్‌. ఎస్‌.డి.శిబూలాల్‌, కె.దినేశ్‌, అశోక్‌ అరోరా బయటకు వచ్చారు. వీరంతా రూ.10 వేల పెట్టుబడితో ఇన్ఫోసిస్‌ కన్సల్టంట్స్‌ అనే స్టార్టప్ ను ప్రారంభించారు. 1987లో అమెరికాలో అంతర్జాతీయ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇన్ఫోసిస్ 2021 జులైలో 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను అధిగమించిన రెండో ఐటీ కంపెనీగా మారింది.

నారాయణ, సుధా ప్రేమ

నారాయణ, సుధా ప్రేమ

నారాయణ మూర్తి.. ఈసీఐఎల్ కోసం బేసిక్ ఇంటర్‌ప్రిటర్‌ను తయారు చేశారు. ఆ సమయంలోనే సుధా మూర్తితో ప్రేమలో పడ్డారు ఉద్యోగం చేస్తేనే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని సుధామూర్తి తండ్రి షరతు విధించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పుణేలోని ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో జనరల్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+