ముంబై: దేశీయ పౌర విమానయాన సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో)కు నష్టాలు వెంటాడుతున్నాయి. వందల కోట్ల రూపాయల మేర నష్టాలను మళ్లీ చవి చూసింది సంస్థ. సంస్థ నష్టాలు మరింత పెరుగుతున్నాయే తప్ప ఎక్కడే గానీ తగ్గట్లేదు. ఈ పరిణామాలు సంస్థ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు. నష్టాలను తగ్గించుకోవడానికి ఇండిగో సంస్థ యాజమాన్యం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఇండిగో క్యూ 4 ఫలితాలివీ..
కొద్దిసేపటి కిందటే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్.. తన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. వాటిని రెగ్యులేటర్కు సమర్పించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 1,682 కోట్ల రూపాయల నికర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అంటే 2021-2022లో 1,147 కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొంది. ఇప్పుడీ సంఖ్య భారీగా పెరిగింది. 1,682 కోట్ల రూపాయలకు చేరింది.

అధిక ఇంధన ధరలు..
అధిక ఇంధన ధరల వల్లే పౌర విమానయాన రంగం భారీగా నష్టాలను చవి చూడాల్సి వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో జెట్ ఫ్యూయెల ధరలను భారీగా పెంచుతూ వస్తోన్న విషయం తెలిసిందే. కిలో లీటర్ మీద వేల రూపాయలను అదనంగా చెల్లించాల్సిన పరిస్థితిని సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా నష్టాలు వస్తున్నాయనే వాదనలు లేకపోలేదు.

పెరిగిన ఆపరేషన్స్ రెవెన్యూ..
కాగా- ఇండిగో ఆపరేషన్స్ రెవెన్యూ భారీగా పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు, లాక్డౌన్ తరహా పరిస్థితుల నుంచి సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ రికవరీ కాగలిగిందనడానికి పెరిగిన ఆపరేషన్స్ రెవెన్యూ నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మొత్తంగా దీని రెవెన్యూ 29 శాతం మేర పెరిగింది. 8,021 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఇండిగో యాజమాన్యం రికార్డు చేసిన ఆపరేషన్స్ రెవెన్యూ 6,223 కోట్ల రూపాయలు.

రూపాయి విలువ క్షీణించడం..
అధిక ఇంధన ధరలు, డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తుండటం వల్ల నష్టాలను చవి చూడాల్సి వచ్చిందని ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రొనొజొయ్ దత్త తెలిపారు. సంస్థ ఇంధన వ్యయం 68.2 శాతం పెరిగిందని, అదనంగా 3,221 కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో 76.7 శాతంగా నమోదైందని, ఇందులో 19.2 శాతంతో 4.40 కోట్ల రూపాయల మేర పెరిగిందని అన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications