భారత ఐటీ కంపెనీలు యూరోప్ వైపు దృష్టి సారించాయి. ఈ ప్రాంతం నుండి అధిక డీల్స్తో పాటు కంపెనీల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నాయి. దేశీయ టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు గత కొద్దికాలంగా యూరోపియన్ మార్కెట్లపై దృష్టి పెట్టాయి. ఇటీవల యూరోపియన్ ప్రాంతం నుండి భారీ డీల్స్ రావడంతో దేశీయ ఐటీ కంపెనీలు రూటు మార్చినట్లు చెబుతున్నారు.
ఇప్పటి వరకు మన ఐటీ కంపెనీలకు ఎక్కువగా రాబడి అమెరికా నుండి ఉంది. ఆదాయంలో అగ్రరాజ్యం వాటా 70 శాతం వరకు ఉంటుంది. అయితే ఇటీవల కంపెనీలు యూరోపియన్ సంస్థలను కొనుగోలు చేస్తున్నాయి. మరిన్ని కొనుగోళ్లు, పెద్ద డీల్స్ రానున్నాయని ఐటీ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

జర్మన్ మార్కెట్..
యూరోప్ నుండి చూసుకుంటే ఇటీవల జర్మనీ నుండి మెగా డీల్స్ వచ్చాయని, జర్మన్ కంపెనీలు గతంలో ఔట్ సోర్సింగ్కు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయని హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సీఈవో అన్నారు. జర్మన్ కంపెనీలు వ్యూహం మార్చి ఔట్ సోర్సింగ్కు ప్రాధాన్యత ఇవ్వడంతో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు అవకాశాలు పెరిగినట్లు చెబుతున్నారు. లాభదాయక జర్మన్ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేలా ముందుకు సాగుతున్నాయి.

పట్టు కోసం టీసీఎస్
టీసీఎస్ యూరోప్ మార్కెట్లో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తోందని, ఈ ప్రాంతంలో మరిన్ని అక్వైజేషన్స్ ఉండవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాంత నుండి ప్రతి ఏడాది 20 శాతం కంటే ఎక్కువ వృద్ధి కనిపిస్తోందని చెబుతున్నారు. నవంబర్ నెలలో టీసీఎస్ ఇక్కడి పోస్ట్ బ్యాంక్ సిస్టం ఏజీ నుండి దక్కించుకుంది. జర్మనీకి చెందిన ఈ కంపెనీలో 1500 మంది ఉద్యోగులు ఉన్నారు. అదే నెలలో ఐటీ అసెట్స్ ఆఫ్ ప్రమెరికా సిస్టంను అక్వైర్ చేసుకుంది.

విన్నింగ్ స్ట్రాటెజీ
టీసీఎస్తో పాటు ఇతర టెక్నాలజీ సంస్థలకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం వంటి అంశాలు విన్నింగ్ స్ట్రాటెజీగా ఉన్నాయని చెబుతున్నారు. ఇతర కంపెనీల కొనుగోళ్ల నేపథ్యంలో టీసీఎస్ 2022 ఆదాయ అంచనాల్లో భారీగా వృద్ధి ఆశిస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications