న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది ఉద్యోగుల శాలరీ పెంపు సగటున 6.4 శాతంగా ఉండవచ్చునని విల్లీస్ టవర్స్ వాట్సన్ సర్వే వెల్లడించింది. గత ఏడాదిలో ఇది 5.9 శాతంగా ఉందని, దానితో పోల్చుకుంటే కాస్త మెరుగుపడుతుందని వెల్లడించింది. కార్పోరేట్ రంగంలో వ్యాపార పునరుద్ధరణపై ఆశావాదం పెరిగిందని, అయితే వేతన పెంపు బడ్జెట్లో మాత్రం ప్రతిబింబించడం లేదని పేర్కొంది. వేతన పెంపు బడ్జెట్ కేటాయింపుల్లో కీలక ఉద్యోగులు, ప్రతిభ కనబరిచే నిపుణులు వలస వెళ్లకుండా కాపాడుకునేందుకు కంపెనీలు పెద్దపీట వేయవచ్చునన్నారు.
ప్రతిభావంతులకు ఈ ఏడాది సగటున 20.6 శాతం వేతన పెంపు ఉండే అవకాశాలు ఉన్నాయని, అంచనా వేసింది. 2020 అక్టోబర్/నవంబర్ కాలంలో ఆన్లైన్ ద్వారా 130 దేశాలకు చెందిన 18,000 కంపెనీల ప్రతినిధులను సర్వే చేసి ఈ నివేదిక రూపొందించింది. భారత్లో సర్వే చేసిన కంపెనీల్లో 37 శాతం వచ్చే ఏడాది కాలంలో ఆదాయంపై సానుకూలంగా ఉన్నాయి. కానీ నియామకాలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది.

సర్వే వివరాల ప్రకారం హైటెక్, ఫార్మా, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, రిటైల్ రంగాల్లో దాదాపు 8 శాతం, ఆర్థిక సేవలు, తయారీ రంగాల్లో 7 శాతం, బీపీవోలో 6 శాతం, ఎనర్జీ రంగంలో 4.6 శాతం మేర వేతనాల పెంపుకు అవకాశాలు ఉన్నాయి. నియామకాల్లో వేగం పెరగాల్సి ఉందని, గతంతో పోలిస్తే కొత్త నియామకాలు అనువైన సంస్థలు 14 శాతం నుంచి 10 శాతానికి పడిపోయాయని సర్వే వెల్లడించింది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications