For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం దిగుమతులు 47% డౌన్, అక్టోబర్‌లో 36% జంప్: ఆభరణాల ఎగుమతులు 50% క్షీణత

|

2020-21 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు) పసిడి దిగుమతులు భారీగా తగ్గాయి. ఈ కాలంలో 47 శాతం తగ్గి 9.28 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.69,000 కోట్లు) పరిమితమయ్యాయి. కరోనా మహమ్మారి, లాక్ డౌన్, ధరలు ఈ కాలంలో భారీగా పెరగడంతో పసిడి కొనుగోళ్లు తగ్గాయి. మార్చి చివరి వారంలో లాక్ డౌన్ ప్రారంభం కాగా, అంతకుముందు పసిడి ధరలు రూ.40వేల దిగువన పలికాయి. మూడు నెలల క్రితం రూ.58వేలకు చేరుకొని, ఇప్పుడు రూ.52వేల దిగువన ఉన్నాయి. అంటే ప్రస్తుతం రూ.12వేల వరకు పైన పలుకుతోంది. ధరలు భారీగా పెరగడంతో సెప్టెంబర్ వరకు కొనుగోళ్ళు పడిపోయాయి. ఆగస్ట్ 7వ తేదీ తర్వాత నుండి ధరలు దాదాపు స్థిరంగా ఉండటంతో పాటు దసరా, దీపావళి, ధనత్రయోదశి సమయంలో కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. అయితే కాయిన్స్ ఎక్కువగా కొనుగోలు చేశారు.

<strong>2 రోజుల్లో రూ.400కు పైగా పెరిగిన బంగారం ధర: రూ.67,000 దిశగా... కొనుగోలు చేయవచ్చా?</strong>2 రోజుల్లో రూ.400కు పైగా పెరిగిన బంగారం ధర: రూ.67,000 దిశగా... కొనుగోలు చేయవచ్చా?

7 నెలల్లో దిగుమతులు డౌన్, అక్టోబర్‌లో జంప్

7 నెలల్లో దిగుమతులు డౌన్, అక్టోబర్‌లో జంప్

2019 ఏప్రిల్ - అక్టోబర్ కాలంలో పసిడి దిగుమతులు 17.64 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.31 లక్షల కోట్లు) కాగా, ఈసారి 47.42 శాతం క్షీణించి 9.28 డాలర్లకు పడిపోయాయి. ఏడు నెలల కాలంలో భారీగా తగ్గినప్పటికీ, అక్టోబర్ నెలలో మాత్రం దిగుమతులు 36 శాతం పెరగడం గమనార్హం. పండుగ సీజన్, ధరలకు ప్రజలు అలవాటు పడటం వంటి కారణాలతో సేల్స్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఏప్రిల్-అక్టోబర్ కాలంలో వెండి దిగుమతులు 64.65 శాతం పడిపోయి 742 మిలియన్ డాలర్లుగా ఉంది.

తగ్గిన వాణిజ్య లోటు

తగ్గిన వాణిజ్య లోటు

2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల కాలంలో పసిడి, వెండి దిగుమతులు దాదాపు సగం మేర తగ్గడంతో వాణిజ్యలోటు 32.16 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వాణిజ్యలోటు 100.67 బిలియన్ డాలర్లుగా ఉంది. జ్యువెల్లరికీ మన దేశంలో డిమాండ్ ఎక్కువ. దీంతో బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఉంది. ప్రతి ఏటా దాదాపు 800 టన్నుల నుండి 900 టన్నుల మేర బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.

తగ్గిన ఆభరణాల ఎగుమతులు

తగ్గిన ఆభరణాల ఎగుమతులు

రత్నాలు, ఆభరణాల ఎగుమతులు కూడా భారీగానే క్షీణించాయి. ఏప్రిల్ - అక్టోబర్ కాలంలో ఈ దిగుమతులు దాదపు 49.5 శాతం తగ్గి 11.61 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బంగారం డిమాండ్ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కాస్త పుంజుకుంది. ప్రధానంగా దీపావళి, ధనత్రయోదశి సమయంలో ఎంతోకొంత బంగారం కొనుగోలు చేయాలని కోట్లాది మంది విశ్వసిస్తారు. దీంతో చిన్న మొత్తంలో కొనుగోళ్లు జరిపారు.

English summary

బంగారం దిగుమతులు 47% డౌన్, అక్టోబర్‌లో 36% జంప్: ఆభరణాల ఎగుమతులు 50% క్షీణత | India's gold imports drop 47 percent during April-October

Gold imports, which have a bearing on the current account deficit, declined 47.42% to $ 9.28 billion during April-October due to fall in demand in the wake of the COVID-19 pandemic, according to data from the Commerce Ministry. Imports of the yellow metal stood at $ 17.64 billion in the corresponding period of 2019-20.
Story first published: Monday, November 16, 2020, 10:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X