చైనా లక్ష్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ పొరుగు దేశాల్లోని కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ కూడా ధీటుగా సమాధానం చెప్పింది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పుడు చైనాకు అనుకూలంగా మారకూడదని ఈ నిర్ణయం తీసుకుంది.

చైనా పెట్టుబడులకు భారత్ బ్రేక్
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చైనా కంపెనీలు ఇప్పటికే విధించుకున్న పెట్టుబడి లక్ష్యాలకు ఈ నిర్ణయం బ్రేక్ వేసింది. దీంతో చైనా ప్రభుత్వంతో పాటు చైనీస్ ఇండస్ట్రీస్ వర్గాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భారత్ తన నిర్ణయంలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ ఆ కంపెనీలకు కాస్త ఊరట కలిగిస్తోంది.

చైనీస్ కంపెనీలకు కాస్త ఊరట
ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళికలకు ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు చైనా కంపెనీ ప్రతిపాదనల పరిశీలనను వేగవంతం చేయాలని మాత్రమే ప్రభుత్వం నిర్ణయించింది. వ్యూహాత్మక రంగాలు మినహా ఇతర అప్రధాన్య రంగాలకు సంబంధించి చైనా కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనలను 15 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అంటే కేవలం చైనాకే కాదు. భారత్ పొరుగుదేశాలన్నింటికి ఇది వర్తిస్తుంది. అయితే సక్రమంగా ఉన్న పెట్టుబడులను వేగవంతం మాత్రమే చేస్తారు. కానీ కేంద్రం అనుమతులు మాత్రం తప్పనిసరి. ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదు.

అలీబాబా సహా వివిధ కంపెనీల ఆసక్తి
కరోనా సమయంలో అవకాశవాదుల పెట్టుబడులు లేకుండా కేంద్రం తీసుకున్న జాగ్రత్తల వల్ల ఇతర పెట్టుబడులపై ప్రభావం పడుతుందని, ప్రక్రియకు సమయం తీసుకుంటుందని కొన్ని చైనా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. SAIC ఎంజీ మోటార్స్, గ్రేట్ వాల్తో పాటు అలీబాబా, టెన్సెంట్ వంటి పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సున్నితరహిత రంగాల్లో పెట్టుబడులను 15 రోజుల్లో ఆమోదించేలా కేంద్రం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.

ఎక్కువ సున్నితమైనవి ఇవే..
ఇన్వెస్ట్మెంట్ ప్రపొజల్స్ను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తామని, కొన్ని రంగాలకు మాత్రం ఆలస్యం కావొచ్చునని సంబంధిత అధికారులు చెబుతున్నారట. దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఆటోమొబైల్స్, పునరుత్పాదక ఇంధనం కంటే టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్ వంటి విభాగాలను ఎక్కువ సున్నితమైనవిగా భావించే అవకాశముంది. ఆమోదానికి రెండు వారాల నుండి నాలుగు వారాలు పర్వాలేదని, కానీ క్లిష్టంగా ఉండవద్దని అంటున్నారు.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications