For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్, డీజిల్‌పై వినియోగదారులకు భారీ షాక్!: ప్రపంచంలోనే అత్యధిక ట్యాక్స్ వసూలు

|

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ పైన ఏకంగా రూ.10, డీజిల్ పైన రూ.13 సుంకం పెంచింది. ఈ ధరలు ఈ రోజు (ఏప్రిల్ 6) నుండి అమలులోకి వచ్చాయి. అయితే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్రం తెలిపింది. పెట్రోల్, డీజిల్ పైన ప్రపంచంలోనే ఎక్కువ ట్యాక్స్ వసూలు చేసే దేశంగా ఇప్పుడు భారత్ నిలిచింది.

'లక్సెంబర్గ్'తో డబుల్.. చైనాను వదిలే కంపెనీలకు ఇండియా ఆఫర్! ఆంధ్రప్రదేశ్‌తో ఆ కంపెనీల చర్చలు'లక్సెంబర్గ్'తో డబుల్.. చైనాను వదిలే కంపెనీలకు ఇండియా ఆఫర్! ఆంధ్రప్రదేశ్‌తో ఆ కంపెనీల చర్చలు

ట్యాక్స్ పెంపు ఇలా.. ప్రపంచంలోనే ఎక్కువ వసూలు

ట్యాక్స్ పెంపు ఇలా.. ప్రపంచంలోనే ఎక్కువ వసూలు

ప్రభుత్వం లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన రోడ్ సెస్‌ను రూ.8 పెంచింది. ఎక్సైజ్ డ్యూటీని ఒక్కో లీటర్ పెట్రోల్ పైన రూ.2 పెంచింది. లీటర్ డీజిల్ పైన రూ.5 పెంచింది. తాజా పెంపుతో ట్యాక్స్‌లు 69 శాతానికి పెరిగాయి. ఇప్పటి వరకు 60 శాతం లోపు భారత్‌లో ఉంది. కొన్ని దేశాలు 60 శాతాని కంటే ఎక్కువగా ఉన్నాయి. తాజా పెంపుతో వాటిని దాటి, ప్రపంచంలోనే ఎక్కువ ట్యాక్సులు వసూలు చేసిన దేశంగా నిలిచింది.

ఇంధన ధరలు పెరగలేదు..

ఇంధన ధరలు పెరగలేదు..

కేంద్రం ఇంధన ధరలను పెంచలేదు. కేవలం ఎక్సైజ్ సుంకాన్ని మాత్రమే పెట్రోల్, డీజిల్ పైన వరుసగా రూ.10, రూ.13 పెంచాయి. మార్కెట్ మందగమనం నేపథ్యంలో ప్రస్తుత ఎక్సైజ్ డ్యూటీ పెంపు మార్కెట్ పైన ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన తర్వాత కూడా ఇక్కడ రిటైల్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

60 శాతానికి పైగా ఈ దేశాల్లో

60 శాతానికి పైగా ఈ దేశాల్లో

పెట్రోల్, డీజిల్ పైన ఇండియాలో ట్యాక్స్ 69 శాతానికి పెరిగింది. 60 శాతం కంటే ఎక్కవగా ఫ్రాన్స్ (63 శాతం), జర్మనీ (63 శాతం), ఇటలీ (64 శాతం), బ్రిటన్ (62 శాతం) దేశాలలోను వసూలు చేస్తున్నారు. స్పెయిన్‌లో 53 శాతం, జపాన్‌లో 47 శాతం, కెనడాలో 33 శాతం, అమెరికాలో 19 శాతం ఉంది.

వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ పెంచిన ఢిల్లీ ప్రభుత్వం

వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ పెంచిన ఢిల్లీ ప్రభుత్వం

మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం కూడా వాహనదారులకు షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు గత నెలన్నరగా నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో రిటైల్ ధరలను పెంచింది ప్రభుత్వం. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరపై రూ.1.67, లీటర్ డీజిల్‌పై రూ.7.10 పెరిగింది. ఢిల్లీ ప్రభుత్వం వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ పెంచడమే దీనికి కారణం. అసోంలోను గత నెలలో రాష్ట్రం పెంచింది. అన్ని రాష్ట్రాలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశాలు లేకపోలేదు.

English summary

పెట్రోల్, డీజిల్‌పై వినియోగదారులకు భారీ షాక్!: ప్రపంచంలోనే అత్యధిక ట్యాక్స్ వసూలు | India now has highest taxes on petrol in the world with 69 percent

The steepest ever hike in excise duty by Rs 13 per litre on diesel and Rs 10 per litre on petrol last night has catapulted India as the country with the highest taxes on fuel.
Story first published: Wednesday, May 6, 2020, 13:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X