కరోనా మహమ్మారి నేపథ్యంలో మారటోరియం పొడిగింపు వల్ల బ్యాంకులకు వచ్చే రుణ చెల్లింపులు ఆలస్యం కానున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడంతో ఎన్పీఏలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు పలువురు ఆర్థిక నిపుణులు ఎన్పీఏలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులకు రూ.1.5 ట్రిలియన్ (19.81 బిలియన్ డాలర్లు) ఇంజెక్ట్ చేయవలసి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్పీఏలు పెరగొచ్చు.. బ్యాంకులకు ఫండ్స్ అవసరం
ప్రభుత్వం తొలుత రూ.250 బిలియన్స్ మొత్తాన్ని బ్యాంకు రీక్యాపిటలైజేషన్కు పంప్ చేయాలని నిర్ణయించిందని, కానీ ఇప్పుడు ఇది గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా - లాక్ డౌన్ కారణంగా రుణ ఎగవేతలు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి బ్యాంకులు. బ్యాంకుల పరిస్థితి భయంకరంగా ఉండవచ్చునని, త్వరలో నిధులు అవసరం కావొచ్చునని చెబుతున్నారు. దీని గురించి ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

ఎన్పీఏలు 20 శాతానికి పెరగొచ్చు
భారతీయ బ్యాంకులు 2019 సెప్టెంబర్ నాటికి రూ.9.35 ట్రిలియన్ల నిరర్థక ఆస్తులను కలిగి ఉన్నాయి. ఇది వాటి మొత్తంలో 9.1 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (వచ్చే మార్చి నాటికి) నిరర్థక ఆస్తులు 18 శాతం నుండి 20 శాతానికి పెరగవచ్చునని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రుణాల్లోని 20 శాతం నుండి 25 శాతం వరకు రిస్క్లో ఉన్నట్లు భావిస్తున్నారు.

రీక్యాపిటలైజేషన్ కోసం...
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మూడో నెలలోకి ప్రవేశించింది. మార్చి 24వ తేదీన ఇది ప్రారంభమైంది. దీంతో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, వృద్ధి రేటు భారీగా మందగిస్తుందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఆర్థిక పునరుద్ధరణకు సమయం పడుతుందని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం పూర్తి నిధులు ఇంజెక్ట్ చేయలేదని, రీక్యాపిటలైజేషన్ కోసం బాండ్స్ జారీ చేయడం వంటి పరోక్ష చర్యలపై ఆధారపడవచ్చునని చెబుతున్నారు. గతంలోను ఈ పద్ధతి ఉపయోగించినట్లు చెబుతున్నారు.

రుణాల రేటు 6 శాతం నుండి 7 శాతం
ప్రభుత్వరంగ బ్యాంకుల కోసం కేంద్రం గత అయిదేళ్లలో రూ.3.5 ట్రిలియన్లను పంప్ చేసింది. సంక్షోభం కారణంగా కొత్త రుణాలు తగ్గాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా బ్యాంకులు రుణాల రేటును 6 శాతం నుండి 7 శాతం ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెబుతున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్ అని చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాపిటల్ మార్కెట్ నుండి మనీ నిధుల సమీకరణ అంత సులంభం కాదు. ప్రస్తుత మందగమన పరిస్థితుల్లో బ్యాంకులను నిలబెట్టేందుకు మూలధనం అవసరమంటున్నారు.
More From GoodReturns

How to get personal loan: పర్సనల్ లోన్ ఎలా పొందాలి! స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదిగో..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications