India to borrow: మరో వారం రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. భారత ప్రభుత్వం ప్రాధాన్యతలు, కేటాయింపులపై రాయిటర్స్ సంస్థ పోల్ నిర్వహించింది. 43 మంది ఆర్థిక వేత్తలు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా రుణ సమీకరణ, తిరిగి చెల్లింపుల ప్రణాళికల గురించి చర్చించారు. మౌలిక సదుపాయాలు కల్పన, ఆర్థిక లోటు అధిగమించడంపై పలు సూచనలు చేశారు.

భారీగా రుణ భారం
రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 16 లక్షల కోట్ల రూపాయల రుణం సమీకరించనున్నట్లు రాయిటర్స్ పోల్ వెల్లడించింది. 2014లో భాజపా అధికారంలోకి వచ్చినప్పుడు దేశ వార్షిక రుణాలు 5.92 లక్షల కోట్లు కాగా.. 2022-23 ఏడాదిలో 14.2 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్లు గుర్చుచేసింది. కొవిడ్ సంక్షోభవం కారణంగా గత నాలుగేళ్లలో ప్రజా సంక్షేమానికి సర్కారు అధికంగా ఖర్చు చేసినట్లు పేర్కొంది. తద్వారా రుణభారం భారీగా పెరిగినట్లు తెలిపింది. రానున్న రోజుల్లో వృద్ధి మందగించడం, ఆర్థిక క్రమశిక్షణ చర్యల వల్ల రాబడి తగ్గనున్నట్లు అంచనా వేసింది.

సింహభాగం చెల్లింపులకే
పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోనుండటానికి ప్రధాన కారణం తిరిగి చెల్లింపుల భారమని ఆర్థికవేత్త ధీరజ్ నిమ్ పేర్కొన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను 4.4 లక్షల కోట్లు రీపేమెంట్ చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. 2023-24లో బడ్జెట్ లోటు జీడీపీలో 6 శాతానికి తగ్గుతుందని అభిప్రాయాలు వ్యక్తమైనా.. 2025-26 నాటికి 4.5 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి మాత్రం చాలా దూరంలో ఉండనున్నట్లు చెబుతున్నారు.

క్రెడిట్ రేటింగ్ పై ప్రభావం
దేశ రుణభారం పెరుగుదలకు అడ్డుకట్ట వేసి, స్థిరంగా ఉంచుకునేందుకు ఇండియా మరింత మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇప్పటికే సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణభారం జీడీపీలో 83% శాతం ఉండగా.. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ కావడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయిలో భారత్ క్రెడిట్ రేటింగ్ మీద సైతం ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

సబ్సిడీల్లో కోత దిశగా..
రానున్న ఆర్థిక సంవత్సరం కేంద్రం మూలధన వ్యయం దాదాపు 9 లక్షల కోట్లకు చేరుతుందని పోల్ అభిప్రాయపడింది. అంటే జీడీపీలో సుమారు 3 శాతానికి సమానం. చైనాకు ధీటుగా ఎదగాలనే భారత్ కల నెరవేరాలంటే పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎక్కువగా వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వానికి నిధులు ఎక్కువగా అవసరం అవుతాయని అర్ధం. 2022-23 బడ్జెట్లో పేర్కొన్న 5 లక్షల కోట్లలో 25 శాతానికి ఆహారం, ఎరువులపై సబ్సిడీని తగ్గించడానికి కేంద్రం చూస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. తద్వారా దాదాపు 1.5 లక్షల కోట్లు మిగిలినట్లే.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications