కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత బుల్ జోరు ఎక్కడా తగ్గడం లేదు. షేర్ మార్కెట్లు అమాంతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని సంస్థలు ఐపీఓలను జారీ చేశాయి. ప్రముఖ హౌజింగ్ ఫైనాన్స్ సంస్థ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ బుధవారం రోజున తొలిసారిగా ఐపీఓలను ఇష్యూ చేసింది. తన షేర్ ప్రీమియం ధరను 19శాతంతో లిస్ట్ చేసింది.
తొలిసారిగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ సంస్థ షేరు ధరను రూ.612.15ని టచ్ చేసింది.బీఎస్ఈపై రూ.518గా ఉండగా అందుకు 19శాతం అధికంతో షేరు వాల్యూను లిస్ట్ చేసింది. దీంతో తొలిరోజున ఈ స్టాక్ బీఎస్ఈపై 639.50 మార్కును తాకగా ఎన్ఎస్ఈ పై రూ.640గా రికార్డు అయ్యింది. ముందుగా లాభాల బాట పట్టిన షేర్ వాల్యూ ఆ తర్వాత క్రమంగా పడిపోయి రూ.565కు చేరింది.

జనవరి 21వ తేదీన జరిగిన హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ షేర్ కొనుగోళ్ల సబస్క్రిప్షన్ సమయంలో ఒక్కో ఈక్విటీ షేర్ వాల్యూ రూ.517 నుంచి రూ.518 మధ్య పలికింది. అయితే అన్ని షేర్లను తొలిరోజునే కొనుగోలు చేయడం జరిగింది. జనవరి 23వరకు షేర్ కొనుగోలు చేసేందుకు గడువు ఉండగా తొలిరోజునే 26.57 రెట్లతో సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఇక బుధవారం నాటికి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ మార్కెట క్యాపిటలైజేషన్ రూ.5,104.70 కోట్లుగా ఉంది.
బెంగళూరుకు చెందిన ఈ గృహరుణాల ఫైనాన్స్ కంపెనీకి వార్బర్గ్ పిన్కస్, ఏత్ మారిషస్, బెస్సెమర్ ఇండియా లాంటి సంస్థల సహకారం ఉంది. 1,153.71 కోట్ల రూపాయల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) లో తాజాగా రూ .265 కోట్ల వరకు ఇష్యూ మరియు 888.7 కోట్ల రూపాయల అమ్మకం ఆఫర్ ఉన్నాయి. ఇక ఐపీఓ కంటే ముందు ఇన్వెస్టర్ల నుంచి రూ. 346 కోట్లు ఈ సంస్థ సేకరించింది. భవిష్యత్ అవసరాలను తీర్చడానికి సంస్థ తన తాజా ఇష్యూ (రూ. 265 కోట్లలో) నుండి వచ్చే నికర ఆదాయాన్ని వినియోగించనుంది.
More From GoodReturns

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు.. బ్యాంకులు కూడా పనిచేయవు.. ఈ రోజు పతనానికి విలవిలలాడుతున్న ఇన్వెస్టర్లు..

ఇన్వెస్టర్లు డబ్బులతో రెడీగా ఉండండి.. దేశ చరిత్రలోనే అతిపెద్ద IPO..రూ. 20 వేల కోట్ల టార్గెట్తో వస్తున్న NSE.

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications