ముంబై: ప్రయివేటురంగ దిగ్గజం HDFC లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లు దాటింది. నేడు ఈ సంస్థ స్టాక్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.2,808ని తాకాయి. దీంతో బ్యాంకు మార్కెట్ క్యాప్ కూడా పెరిగింది. మధ్యాహ్నం గం.2 గంటల సమయానికి ఈ స్టాక్ రూ.2772 వద్ద ట్రేడ్ అయింది. అయితే ఉదయం రూ.2800 దాటింది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి చివరి వారంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నాడు HDFC స్టాక్ 1500 స్థాయికి పడిపోయింది. నాటి నుండి ఇప్పడి వరకు దాదాపు 90 శాతం లాభపడింది.
రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ దాటిన ఆరో భారతీయ కంపెనీ HDFC లిమిటెడ్. ఇంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), HDFC బ్యాంకు లిమిటెడ్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఈ మార్కును దాటాయి. ప్రస్తుతం భారత అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13.02 లక్షల కోట్లు. రూ.12.05 లక్షల కోట్లతో టీసీఎస్ రెండో స్థానంలో, రూ.8.75 లక్షల కోట్లతో HDFC బ్యాంకు మూడో స్థానంలో ఉన్నాయి.

డిసెంబర్ నెలలో HDFC లిమిటెడ్ రూ.2,930 కోట్ల నెట్ ప్రాఫిట్ను నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికిన ఇది 65 శాతం తక్కువ. నెట్ ఇంటరెస్ట్ ఇన్కం 25% పెరిగి రూ.4,000 కోట్లుగా నమోదయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 29% పెరిగి రూ.4,190 కోట్లుగా నమోదయింది. లోన్ బుక్ ఏడాది ప్రాతిపదికన 9.3 శాతం ఎగిసి 4.7 లక్షల కోట్లుగా ఉంది. ఇండివిడ్యువల్, నాన్ ఇండివిడ్యువల్ లోన్ బుక్ వరుసగా 10.5%, 8%కు పెరిగాయి. అసెట్ అండర్మేనేజ్మెంట్ 9.3 శాతానికి పెరిగింది. ప్రధానంగా ఇండివిడ్యువల్ హోమ్ లోన్ రంగం ఇటీవల భారీగా ఎగిసిందని, ఇది కలిసి వచ్చిందని బ్రోకరేజీ సంస్థ ఫిలిప్క్యాపిటల్ పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications