HDFC బ్యాంకు ఉద్యోగులకు ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్(MD), CEO ఆదిత్య పురి భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రంగాల్లో, కంపెనీల్లో ఉద్యోగాల కోత, వేతన కోత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదిత్య పురి తమ బ్యాంకు ఉద్యోగుల్లో ధీమా కల్పించారు. మీ ఉద్యోగులు పోవని, ఇంక్రిమెంట్స్, బోనస్లకు కూడా ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. దేశంలో అతిపెద్ద ప్రయివేటు రంగ HDFC బ్యాంకులో 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మీ ఉద్యోగాలు, వేతన పెంపు, బోనస్ ఎక్కడికీ పోవని, తాను బ్యాంకు, తన అనంతరం బాధ్యతలు చేపట్టనున్న శశిధర్ జగదీషన్ తరఫున హామీ ఇస్తున్నానని చెప్పారు.

బ్యాంకు పనితీరు బాగుంది
ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లోను బ్యాంకు పనితీరు బాగుందని, ఉద్యోగాలు, బోనస్కు ఎలాంటి ఇబ్బందిలేదని, ఉద్యోగులకు ఆదిత్యాపురి భరోసా ఇచ్చారు. ఆయన ఈ నెల ఆఖరులో పదవీ విరమణ పొందుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకులో పని చేస్తోన్న 1.15 లక్షలకు పైగా ఉద్యోగులను ఉద్దేశించి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బ్యాంకు వద్ద మూలధన నిల్వలు కావాల్సినన్ని ఉన్నాయన్నారు. రుణాలపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో మంచి ఫలితాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. 'మీ ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీలేదు. జీతాల పెంపు కూడా ఉంటుంది. బోనస్, ప్రమోషన్లకూ ఢోకా లేదు' అని వీడియో సందేశంలో ధైర్యం చెప్పారు.

కలిసి పని చేయాలి
బ్యాంకు ప్రారంభం నుంచి ఆదిత్యపురి పని చేస్తున్నారు. బ్యాంకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంలో మీ వంతు పాత్ర పోషించేలా, పోటీని తట్టుకొని నిలబడేలా ఓ బృందంగా మీరంతా (ఉద్యోగులు) పని చేయాలని వీడియో సందేశంలో ఆయన సూచించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో క్లోజ్ కావడంతో వ్యవస్థీకృత రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. లాక్ డౌన్ సమయంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో వ్యాపారాలు లేకుండా పోయాయి. కానీ ఎక్కువ శాతం బ్యాంకులు ఉద్యోగులకు వేతనాలు, బోనస్లు ఇవ్వడంతో పాటు భరోసా కూడా ఇస్తున్నాయి.

ఇబ్బంది పెట్టినప్పటికీ..
కరోనా మహమ్మారి పరిమాణాలు బ్యాంకును కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ, బ్యాంకు పని తీరు మెరుగ్గా ఉందని ఆదిత్యపురి అన్నారు. ఇప్పుడు బ్యాంకు పోర్ట్పోలియోలు ఎలాంటి ఒత్తిడిలో లేవన్నారు. పంపిణీ, టెక్నాలజీ ప్రయోజనాలను వేగంగా అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు. పండుగ ఆఫర్ల గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications