ఐటీ కంపెనీ హెచ్ సీఎల్ టెక్నాలజీ బుధవారం క్యూ2 ఫలితాలు విడుదల చేసింది. కంపెనీ వార్షిక ప్రాతిపదికన 6% జంప్ చేసి రూ.3,259 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో HCL టెక్ ఏకీకృత ఆదాయం రూ. 20,655 కోట్ల నుంచి 5.2% పెరిగి రూ.24,686 కోట్లకు చేరుకుంది. కంపెనీషేర్హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండ్ కూడా ప్రకటించింది.

రూ.10
మధ్యంతర డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డు తేదీ 20 అక్టోబర్, 2022న నిర్ణయించారు. " మధ్యంతర డివిడెండ్ చెల్లింపు తేదీ నవంబర్ 2, 2022గా ఉంటుంది" అని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. అంచనా వేసిన 12-14%తో పోలిస్తే స్థిరమైన కరెన్సీలో హెచ్సీఎల్ టెక్ ఇప్పుడు 13.5-14.5% వృద్ధిని సాధించింది.

అట్రిషన్
ఈ త్రైమాసికంలో హెచ్ సీఎల్ కొత్తగా 10,339 మంది ఫ్రెషర్లను చేర్చుకుంది. ఈ త్రైమాసికంలో నికరంగా 8,359 మంది ఉద్యోగులు చేరారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. HCL టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 219,325గా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్ లో వివరించింది. కంపెనీ అట్రిషన్ 23.8 శాతంగా ఉందని వివరించింది.

డిజిటల్-ఫస్ట్
మా కొత్త బ్రాండ్ గుర్తింపు మా గో-టో మార్కెట్ వ్యూహం, అమలు సామర్థ్యాలపై రేజర్-షార్ప్ ఫోకస్ని తీసుకువస్తుందని
హెచ్సిఎల్ టెక్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా చెప్పారు. మా విభిన్నమైన పోర్ట్ఫోలియోతో, డిజిటల్-ఫస్ట్ వరల్డ్లో ముందున్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి మేము మంచి స్థానంలో ఉన్నామని తెలిపారు.

విప్రో
మరో కంపెనీ విప్రో కూడా క్యూ2 ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఏకీకృత నికర లాభాలలో 9.27 శాతం తగ్గుదల
నమోదు చేసింది. బెంగళూరుకు చెందిన సంస్థక నికర లాభం అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో రూ. 2,930.7 కోట్ల నుండి రూ. 2,659 కోట్లుగా ఉంది.
More From GoodReturns

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications