న్యూఢిల్లీ: ఓలా, ఉబెర్ వంటి యాప్ ఆధారిత ట్యాక్సీ ఆపరేటర్లు డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్లకు కళ్లెం వేసేందుకు కేంద్ర రవాణా శాఖ నిర్ణయించింది. ట్యాక్సీ ఆపరేటర్ల కోసం డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్తో పాటు ఇతర మార్గదర్శకాలను జారీ చేయనుందని తెలుస్తోంది. ఇది డ్రైవర్లకు గుడ్ న్యూస్. అయితే పరిశ్రమకు మాత్రం ఇది అంతగా రుచించేది కాదని అంటున్నారు.

20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
సహజసిద్ధ మార్కెట్ ధోరణుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా వాటి వల్ల కలిగే హానీ ఎక్కువగా ఉంటుందనే వాదన, భయం కూడా ఉంటుంది. ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ యాప్ బేస్డ్ ఆపరేటర్ల డ్రైవర్ ఛార్జీలు సాధారణంగా 20 శాతం వరకు ఉంటాయి. అయితే వీటిని పది శాతానికి పరిమితం చేయాలని రవాణా శాఖ ఆలోచన చేస్తోంది.

కంపెనీల ఆందోళన
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే క్యాబ్ అగ్రిగేటర్లపై ఆర్థికభారం పడుతుందని అంటున్నారు. ఓలా, ఉబెర్ క్యాబ్స్ డ్రైవర్లకు అధిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు తక్కువ చార్జీలు వసూలు చేస్తూ పోటీ పడుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఈ చర్యలు తాము ఎదుర్కొంటున్న నష్టాలు మరింతగా పెరుగుతాయని ఆ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.

త్వరలో ప్రజల ముందుకు...
ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీ త్వరలో ముందుకు వస్తుందని ట్రాన్సుపోర్ట్ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారట. ఈ డ్రాఫ్ట్పై ప్రజల అభిప్రాయం తీసుకుంటారని చెబుతున్నారు. దీనిపై ఫీడ్ బ్యాక్ కోసం వచ్చే వారం ప్రజల ముందుకు రావొచ్చునని అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications