పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట
పన్ను చెల్లింపుదార్లకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. తక్కువ మొత్తం ఉన్న అన్ని విత్ హోల్డింగ్ పన్ను ఆదేశాల చెల్లుబాటును మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సున్నా లేదా తక్కువ టీడీఎస్, టీసీఎస్ల దరఖాస్తులు పెండింగులో ఉంటే జూన్ 30వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.
ఇబ్బంది లేకుండా 10 బ్యాంకుల విలీనం, చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంక్
మదింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి మినహాయింపు ధృవపత్రానికి దరఖాస్తు చేసుకోకుంటే గత ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన ధృవపత్రాలే ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది.
కరోనా నేపథ్యంలో అన్ని తక్కువ విత్ హోల్డింగ్స్ పన్ను ఉత్తర్వుల చెల్లుబాటును జూన్ 30 వరకు పొడిగించింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా 44వేల మందికి పైగా ఈ మహమ్మారి వల్ల మృత్యువాత పడ్డారు. ఇండియాలో 1640 కేసులు నమోదు కాగా, 45 మంది మృత్యువాత పడ్డారు. దీని వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్తో జాగ్రత్తలు తీసుకుంది. ఇది ప్రజలను ఇంటికే పరిమితం చేయడంతో కేంద్రం అన్ని అంశాలలో వెసులుబాటు కల్పిస్తోంది.