LIC ఉద్యోగులకు బంపర్ బొనాంజా: 16 వేతన పెంపు, పని దినాలు 5 రోజులే
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్(LIC) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులకు 16 శాతం వేతన పెంపుకు ఆమోదం తెలిపింది యాజమాన్యం. ఉద్యోగులకు ఇది తీపి కబురే. 2017 ఆగస్ట్ నుండి ఈ పెంపు అమలులోకి వస్తుంది. సంస్థ పబ్లిక్ ఇష్యూ కంటే ముందు తమ వేతన సవరణ తేల్చాలని LIC ఉద్యోగులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేతనాలు 16 శాతం పెంచింది.
వేతన పెంపుతో పాటు వారానికి ఐదు రోజుల పని విధానానికి కూడా మేనేజ్మెంట్ ఆమోదం తెలిపింది. ఇక క ప్రతి శనివారం కూడా LIC ఆఫీస్లు పని చేయవు. ఉద్యోగుల గృహ రుణాలపై వడ్డీని ఒక శాతం తగ్గించేందుకు కూడా యాజమాన్యం అంగీకరించింది. దేశంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ అయిన LIC ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ ఇష్యూ ద్వారా రూ.లక్ష కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రత్యేక కోట్ కింద 10 శాతం తగ్గింపుతో షేర్లను అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. బీమా పరిశ్రమలో వేతన సవరణకు సంబంధించి యూనియన్లతో చర్చలు జరిగాయి. అనంతరం తుది వేతన నిర్మాణాన్ని ప్రభుత్వం గెటిజ్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది.