గూగుల్పే నిర్ణయం, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ కార్డులకు టోకెనైజేషన్
గూగుల్ పే దేశంలో తన టోకెనైజేషన్ కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వీసా(VISA)తో కలిసి ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, HSBC, ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డులకు కూడా తన టోకెనైజేషన్ కార్యక్రమాన్ని విస్తరించింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ బ్యాంకుల కార్డుల కస్టమర్లు తమ కార్డ్స్ వివరాలను వెల్లడించకుండా తమ ఫోన్లో ఉండే గూగుల్ పే యాప్ ద్వారా అందే సెక్యూర్డ్ డిజిటల్ టోకెన్ ద్వారా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ చెల్లింపులు జరపవచ్చు.
టోకనైజేషన్ సిస్టం అంటే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను భౌతికంగా పంచుకోకుండా వారి ఫోన్కు జత చేయబడిన సురక్షిత డిజిటల్ టోకెన్ ద్వారా డెబిట్ లేదా క్రెడిట్ చెల్లింపులు చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇంతకుముందు కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎస్బీఐ కార్డ్స్, యాక్సిస్ బ్యాంకుతో జట్టు కట్టింది. ఇప్పుడు ఎస్బీఐ ఇండస్ఇండ్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకుతో జట్టు కట్టింది.
ఈ ఫీచర్ ద్వారా ఆన్లైన్ మర్చంట్స్తోను కలిసి పని చేయనుంది. టోకెనైజేషన్ ద్వారా గూగుల్ పే యూజర్స్ నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్స్ (NFC) ద్వారా 2.5 మిలియన్ వీసా మర్చంట్స్ లొకేషన్స్ వద్ద కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేయవచ్చు.