Gautam Adani: దేశంలో ఎదురులేని వ్యాపారవేత్తగా గౌతమ్ అదానీ ఎదుగుతున్నారు. అయితే ఆయనకు తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. అవును అదానీకి చెందిన విజింజమ్ మెగా పోర్ట్ ప్రాజెక్ట్ కు కేరళలోని మత్స్యకారులు పెద్ద అండంకిగా మారారు. పోర్ట్ అభివృద్దిపై నిరసనలు ప్రారంభించి ప్రధాన రహదారిపై బైఠాయించటం పెద్ద అడ్డంకిగా మారింది.

ప్రాజెక్టుకు అడ్డంకులు..
ఆసియా బిలియనీర్ చేపడుతున్న మెుదటి కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు 900 మిలియన్ డాలర్లుగా ఉంది. నిరసనకారులు ధర్నాకు ఏర్పాట్లు చేసుకోగా.. ప్రధాని నరేంద్ర మోడీ అధికార పార్టీ, హిందూ సంఘాల సభ్యులతో సహా ఓడరేవు మద్దతుదారులు డేరాలను ఏర్పాటు చేశారు. మరోపక్క కోర్టు ఆదేశించినా పోలీసులు ఆందోళనకారులపై చర్యలు తీసుకోవడం లేదు. అడ్డంకులు లేకుండా నిర్మాణాలు చేయాలని న్యాయస్థానం ఆదేశించినా.. పోలీసులు మాత్రం మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగొచ్చని భయపడుతున్నారు.

అదానీ గ్రూప్ ఏమంటోందంటే..
ఓడరేవుకు భారీ వాహనాలను పంపాలని అదానీ గ్రూప్ యోచిస్తోంది. ఈ వారం కోర్టు వాహనాల రాకపోకలను ఆపకూడదని చెప్పింది. అక్టోబర్లో పోర్టు నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన వాహనాలను వెనక్కి తిప్పి పంపాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ చట్టాలకు లోబడి ఉందని.. తీరం కోతకు గురికావటానికి ప్రాజెక్ట్ బాధ్యతకు సంబంధించిన ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టివేసింది. అవసరమైతే ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సైతం సిద్ధంగా ఉన్నారు.

ఆందోళనలకు కారణం..
2015 డిసెంబరు నుంచి పోర్టు నిర్మాణం వల్ల తీరానికి గణనీయమైన నష్టం వాటిల్లిందని నిరసన నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో దాదాపు 56 వేల మంది మత్స్యకారుల జీవనోపాధి స్తంభించిందని నిరసనకారులు అంటున్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థపై ఓడరేవు అభివృద్ధి ప్రభావంపై స్వతంత్ర అధ్యయనాలు నిర్వహించి నిర్మాణాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించాలని నిరసనకారులు కోరుతున్నారు.

అదానీకి ఈ ప్రాజెక్ట్ ముఖ్యం..
ప్రపంచంలోని ప్రధాన షిప్పింగ్ మార్గాలలో విజింజం ప్రత్యేకమైనదని అదానీ అభివర్ణించారు. ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్గా శ్రీలంక నుంచి వ్యాపారాన్ని పొందేందుకు ఇది మంచి స్థానంగా ఉంది. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి చైనా పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీగా పెట్టుబడి పెట్టింది. దీంతో పాటు సింగపూర్, దుబాయ్ నుంచి వాణిజ్యం కూడా ఈ పోర్టు ద్వారా సులభతరం కానుంది.

ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏమిటి..?
కంటైనర్లను ప్రధాన వాణిజ్య మార్గాలలోని మెయిన్లైన్ షిప్ల నుంచి ఇతర వాణిజ్య మార్గాల్లోని చిన్న, ఫీడర్ షిప్లకు బదిలీ చేయడానికి అదానీ అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. పాయింట్-టు-పాయింట్ షిప్పింగ్పై ఆధారపడటం కంటే మరింత పొదుపుగా, అనువైన హబ్-అండ్-స్పోక్ నెట్వర్క్ను రూపొందించడం ప్రాజెక్ట్ లక్ష్యంగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications