Q3 Results: ఇటీవల కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో కొన్ని విశ్లేషకుల అంచనాలకు మించి లాభాలను ఆర్జించి మతిపోగొడుతుండగా.. మరికొన్ని మాత్రం లాభాలు తగ్గటంతో ఇన్వెస్టర్లను బేజార్చాయి. అసలు టెక్ కంపెనీల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

మెరిసిన ఎల్ అండ్ టీ..
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మెరుగైన అమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & టెక్నాలజీ సేవల పోర్ట్ఫోలియోలో వృద్ధి లాభాల పెరుగుదలకు దోహదపడింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం దాదాపు 24 శాతం పెరిగి రూ.2,553 కోట్లుగా నమోదైంది. అయితే ఈ వృద్ధి సంఖ్యలు విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువని చెప్పుకోవాలి. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం సైతం గత సంవత్సరం కంటే 17 శాతం మేర పెరిగింది.

టెక్ మహీంద్రా ఫలితాలు..
దేశీయ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా సైతం తన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఇందులో నెట్ ప్రాఫిట్ 5 శాతం మేర తగ్గి రూ.1,297 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో కంపెనీ 795 మిలియన్ డాలర్లు విలువైన ఆర్డర్లను పొందింది. కంపెనీ గత సంవత్సరం ఇదే కాలంలో రూ.1,368 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఐటీ రంగంలో మాంద్యం వల్ల నెలకొన్న మందగమనం వల్లనే ఆదాయ అంచనాలను కంపెనీ అందుకోలేక పోయిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థ..
ప్రభుత్వ రంగ సంస్థ అయిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(GAIL) క్యూ-3 లాభాల నమోదులో భేజారు కనబరిచింది. మూడో త్రైమాసిక ఫలితాలు 92 శాతం మేర తగ్గటంతో లాభం రూ.245 కోట్లకు పరిమితమైంది. కంపెనీ ఫలితాలు అంచనాలను తారుమారు చేయటంతో స్టాక్ సైతం 5 శాతం మేర నష్టపోయింది. అయితే ఈ కాలంలో వ్యాపార ఆదాయం 37.2 శాతం మేర పెరిగి రూ.35,380 కోట్లుగా నమోదైంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications