భారీగా తరలి వెళ్లిన విదేశీ పెట్టుబడులు: ఆ దేశాల పరిస్థితి దారుణం.. భారత్ కాస్త బెట్టర్
కరోనా మహమ్మారి - షట్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. భారత్ రెండు నెలలుగా లాక్ డౌన్లో ఉంది. దీంతో మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఆసియా దేశాల నుండి పెద్ద ఎత్తున విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
డొమెస్టిక్ బుకింగ్స్ ప్రారంభించిన విమాన సంస్థలు, టిక్కెట్స్ చాలా 'ఖరీదు'
ఆసియా దేశాల నుండి 26 బిలియన్ డాలర్లు
ఈ మేరకు 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ 19 ప్రభావం' పేరుతో కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) ఓ అధ్యయనం చేసింది. ఇందులో భారత్ సహా ఆసియా దేశాల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెనక్కి పోయాయి. కరోనా తర్వాత గత కొద్ది నెలల్లోనే 26 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఆసియాలో పలు అభివృద్ధి చెందిన దేశాల నుండి వెనక్కి వెళ్లినట్లు ఈ అధ్యయనం తెలిపింది.
ఇండియా నుండి 16 బిలియన్ డాలర్లు
ఇందులో కేవలం భారత్ నుండే 16 బిలియన్ డాలర్ల మేర ఉండటం గమనార్హం. ఆసియాలో రానున్న రోజుల్లో భారీ ఆర్థికమాంద్యం తప్పదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురై పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఇతర సంస్థలు కూడా ఇండియా, ఆసియా దేశాల నుండి పెట్టుబడులు పెద్ద మొత్తంలో వెనక్కి వెళ్లినట్లు వెల్లడించాయి.
ప్రభుత్వ సాయం కోసం 3 కోట్ల మంది..
CRS నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. జర్మనీ,ఫ్రాన్స్, యూకే, స్పెయిన్, ఇటలీ వంటి ఐరోపా దేశాల్లో 30 మిలియన్లకు (3 కోట్లు) పైగా ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. యూరోజోన్ ప్రాంతంలో 2020 క్యాలెండర్ ఇయర్లో మొదటి క్వార్టర్లో వృద్ధి రేటు 3.8 శాతం కుంగిపోయింది. 1995 తర్వాత ఈ స్థాయిలో కుంగిపోవడం ఇదే మొదటిసారి.
అమెరికా దారుణం.. భారత్ కాస్త బెట్టర్
అమెరికాలో 2020 క్యాలెండర్ ఇయర్ తొలి క్వార్టర్లో వృద్ధి రేటు 4.8 శాతం కుదించుకుపోతుందని తెలిపింది. 2008 సంక్షోభం తర్వాత ఈ స్థాయిలో వృద్ధి రేటు క్షీణించడం ఇదే మొదటిసారి అని తెలిపింది. ప్రపంచ దేశాలకు కరోనా ఆర్థిక సవాళ్లను విసురుతోందని తెలిపింది. ఇక, భారత్కు కొంతలో కొంత ఊరట కలిగించే విషయం ఏమంటే భారత్ సహా మరో రెండు దేశాల వృద్ధి రేటు మాత్రం పాజిటివ్గా ఉండవచ్చునని CRS నివేదిక తెలిపింది.