తక్కువ సమయంలోనే గమ్యస్థానాన్ని చేరవచ్చు, పైగా ఈ మధ్య టిక్కెట్లు కూడా చౌక ధరలకే లభిస్తున్నాయని.. విమానయానం చేద్దామని అనుకుంటున్నారా? ఆలోచన మంచిదే కానీ, మీరు టిక్కెట్ బుక్ చేసుకున్న రోజు అసలు ఆ విమానం బయలుదేరుతుందో? లేదో? ఒకవేళ బయలుదేరినా.. నిర్ణీత సమయానికే బయలుదేరుతుందన్న నమ్మకం లేదు.
అవును, చౌక విమానయాన సంస్థలైన ఇండిగో, గో ఎయిర్ విమానాల్లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఇటీవలి కాలంలో తరచూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి. గత వారం హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి కొచ్చి వెళ్లాల్సిన గో ఎయిర్ విమాన సర్వీసు అర్థాంతరంగా రద్దు అవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

సర్వీసుల రద్దుకు కారణాలు అనేకం...
విమాన సర్వీసుల రద్దుకు చాలా కారణాలు ఉన్నాయని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పైలెట్ల కొరత, అనుకోకుండా ఎదురయ్యే సాంకేతిక సమస్యలతోపాటు ఇతరత్రా సమస్యల కారణంగా ఇలా హఠాత్తుగా విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వస్తున్నట్లు అవి పేర్కొంటున్నాయి. సాధ్యమైనంత వరకు ప్రయాణికులకు ఇబ్బంది ఎదురవకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని, కొన్నిసార్లు ఆలస్యం భరించలేక ప్రయాణికులు ఆందోళనకు దిగుతున్నారని అంటున్నాయి.

వేధిస్తోన్న పైలెట్ల కొరత...
ప్రస్తుతం దేశంలోని పలు విమానయాన సంస్థలు 650కిపైగా విమానాలను నడుపుతున్నాయి. వీటిని నడిపేందుకు 8 వేల మంది పైలెట్లు అందుబాటులో ఉన్నారు. అయినప్పటికీ పలు విమానయాన సంస్థలు పైలెట్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. పైలెట్లు అందుబాటులో లేక పలు విమానయాన సంస్థలు ఆఖరి నిమిషంలో తమ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నాయి. గో ఎయిర్ సంస్థలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఈ పైలెట్ల కొరత ఇప్పట్లో తీరేలా కూడా కనిపించడం లేదు.

ఎందుకీ కొరత అంటే...
ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిర్ణీత పని గంటల అనంతరం పైలెట్లకు విశ్రాంతి అవసరం. ఈ విషయంలో పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) కాస్త కఠినంగానే ఉంది. పైలెట్లకు విశ్రాంతి నిబంధనలను అది తప్పనిసరిగా అమలు చేస్తోంది. దీంతో ఉన్న పైలెట్లతో ఎక్కవ సమయంపాటు పనిచేయించుకునే అవకాశం విమానయాన సంస్థలకు లేకుండా పోయింది. మరోవైపు భారతీయ పైలెట్లకు ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. దేశీయ విమానయాన సంస్థలతో పోలిస్తే ఈ దేశాల విమానయాన సంస్థలు వీరికి అత్యధిక జీతభత్యాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో కొంత మంది భారతీయ పైలెట్లు అక్కడి విమానయాన సంస్థల్లో చేరడం వల్ల కూడా దేశీయంగా కొరత ఏర్పడుతోంది.

వాతావరణ ప్రతికూలత...
ప్రస్తుతం ఉత్తర భారతాన్ని చలి గడగడలాడిస్తోంది. ఢిల్లీ సహా పలు విమానాశ్రయాలను దట్టమైన పొగ మంచు కప్పేస్తోంది. ఫలితంగా ఆయా విమానాలు రన్వేలపై దిగడం, టేకాఫ్ తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో పలు విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. కొన్నిసార్లు ఆయా విమానాశ్రయాలకు రావలసిన విమానాలను వాతావరణ ప్రతికూలత వల్ల దారి మల్లిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాల్సిన కొన్ని విమానాలను పొగమంచు కారణంగా సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు. జనవరి ఆఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

సాంకేతిక సమస్యలు...
విమానాల్లో హఠాత్తుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడం వల్ల కూడా అవి తరచూ రద్దు అవుతున్నాయి. ఎయిర్బస్ ఏ320 నియో విమానాల్లోని ప్రాట్ అండ్ విట్నీ (పీడబ్ల్యూ) ఇంజిన్లలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలతో ఈ ఇంజన్లు మొరాయిస్తున్నాయి. దీంతో ఈ విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఆ సర్వీసులను రద్దు చేయాల్సి వస్తోంది. అదే సమయంలో ప్రయాణికుల కోసం మరో విమానాన్ని అందుబాటులోకి తీసుకురావటంలో విమానయాన సంస్థలు కూడా విఫలం అవుతున్నాయి.

రద్దీకి అనుగుణంగా విమానాలు లేక...
ఈ మధ్య కాలంలో విమానాల్లో ప్రయాణించే వారు అధికమయ్యారు. ఇటు దేశీయ, అటు విదేశీ ప్రయాణాల టిక్కెట్లు సైతం చౌక ధరలకే లభిస్తుండడంతో రద్దీ బాగా పెరిగిపోయింది. మరోవైపు ప్రయాణికుల రద్దీకి సరిపడా విమానాలు లేవు. దీంతో భారత్కు చెందిన పలు విమానాయాన సంస్థలు విమానాల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నాయి. ఎయిర్బస్ ఎ320 నియో, బోయింగ్ కంపెనీ బీ737 మాక్స్ విమానాల సరఫరా కోసం భారీగా ఆర్డర్లు కూడా ఇచ్చాయి. అయితే ఈ రకం విమానాల్లో ఇటీవల పలు సాంకేతిక సమస్యలు వెలుగుచూశాయి. దీంతో వాటిని తయారు చేసిన కంపెనీలు ఆ లోపాలను సరిదిద్దే పనిలో పడ్డాయి. దీంతో డిమాండ్కు సరిపడా విమానాలను సరఫరా చేయలేని పరిస్థితిలో పడ్డాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications