కరోనా కల్లోలం నేపథ్యంలో ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ నుండి దేశీయ విమానా సర్వీసులను రద్దు చేసింది. సరుకు రవాణా విమానాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. అంటే విమానాలు మంగళవారం అర్ధరాత్రి నుండే క్యాన్సిల్ అవుతున్నాయి. ఆ లోపు అంటే అర్ధరాత్రి గం.11.59 సమయానికి గమ్య స్థానాలకు చేరుకునేలా విమానయాన సంస్థలు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది.
తదుపరి ఆదేశాల వరకు విమాన సర్వీసులను నిలిపివేయాలి. ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను వారం రోజుల పాటు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 415కు చేరుకున్నాయి. మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.

ఒక్క విమానాన్ని కూడా ఢిల్లీకి అనుమతించేది లేదని ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే నిర్దేశించిన గడువు వరకు సేవల్లో ఎలాంటి మార్పులు లేవని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications