ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుండి గుడ్ న్యూస్. ఉద్యోగుల డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ను మూడు శాతం మేరకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపు 34 శాతానికి చేరుకుంటుంది. ఈ పెంపు జనవరి 2022 నుండి అమలులోకి వస్తుంది. ఈ పెంపు ఏడో కేంద్ర వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉందని ప్రభుత్వం తెలిపింది.
ఇంధనం, చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్భణం నేపథ్యంలో దాదాపు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరుతుంది. డీఏ పెంపు, డీఆర్ పెంపు కారణంగా ఖజానా పైన అదనంగా రూ.9,544.50 కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు డీఏ, డీఆర్లను సవరిస్తుంది. జనవరి, జూలై నెలలో ఉంటుంది.

అయితే ఈ డీఏ, డీఆర్ పెంపు ఉద్యోగి ఎక్కడ ఉన్నారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. కరోనా కారణంగా ఒకటిన్నర సంవత్సరాలకు పైగా డీఏ, డీఆర్లలో ఎలాంటి మార్పులేదు. కానీ జూలై 2021లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 17 శాతంగా ఉన్న డీఏ, డీఆర్లను 28 శాతానికి పెంచింది. అక్టోబర్ 2021లో ఇది మరో మూడు శాతం పెరిగి 31 శాతానికి చేరింది. ఇప్పుడు మరో మూడు శాతం పెరగడంతో 34 శాతమైంది. ఉద్యోగి మూలవేతనంతో ప్రస్తుత డీఏ రేటును గుణించడం ద్వారా లెక్కిస్తారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications