ముంబై: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు పెరగడం, దేశంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించడం వంటి అంశాలు దలాల్ స్ట్రీట్ నష్టానికి కారణమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 1300 పాయింట్ల వరకు నష్టపోయింది. దీంతో ఇన్వెస్టర్లు మొదటి అరగంటలోనే రూ.5.27 లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఓ సమయంలో 1400 పాయింట్లకు పైగా కూడా నష్టపోయింది. నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనమైంది.

అందుకే నష్టాల్లోకి మార్కెట్లు
మధ్యాహ్నం గం.1.00 సమయానికి సెన్సెక్స్ 1050 పాయింట్లు నష్టపోయి 47,776 పాయింట్ల వద్ద, నిఫ్టీ 310 పాయింట్లు క్షీణించి 14,308 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మారకం వ్యాల్యూ రూ.74.65 వద్ద ట్రేడ్ అయింది. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కఠిన ఆంక్షలు ప్రకటిస్తున్నాయి.
తాజాగా బీహార్, తమిళనాడు, రాజస్థాన్ కూడా రాత్రి కర్ఫ్యూ ప్రకటించాయి. అలాగే అనేక రాష్ట్రాలు వారాంతపు లాక్డౌన్లను ప్రకటించాయి. ఢిల్లీ, మహారాష్ట్రల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. కరోనా వ్యాక్సీన్, రెమ్డెసివిర్ పరిమిత సరఫరా ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వివిధ కారణాలతో సూచీలు నష్టపోయాయి.

ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు దెబ్బ
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆర్థిక రికవరీ మందగించే అవకాశముందని ఆర్థిక నిపుణులు, బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించాయి. స్థానికంగా విధిస్తున్న లాక్డౌన్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడి, రికవరీ నెమ్మదిస్తుందని, అందుకే జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపాయి. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.55 శాతం, ఇన్ఫోసిస్ 1.11 శాతం, సిప్లా 1.05 శాతం, HCL టెక్ 0.58 శాతం, బ్రిటానియా 0.50 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 5.00 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 4.80 శాతం, అదానీ పోర్ట్స్ 4.64 శాతం, ఓఎన్జీసీ 4.66 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 4.21 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో విప్రో, టాటా మోటార్స్, సిప్లా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications