పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి చైనాకు చెందిన నాలుగైదు ప్రముఖ మొబైల్ కంపెనీల కార్యాలయాలపై దేశవ్యాప్తంగా ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. చైనాకు చెందిన ఒప్పో, షియోమీ, వన్ ప్లస్, వివో, రియల్మీ సహా పలు చైనా కంపెనీలు భారత్లో మొబైల్స్ను విక్రయిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గ్రేటర్ నోయిడా, కోల్కతా, గౌహతి, ఇండోర్తో సహా వివిధ నగరాల్లో 24కు పైగా ఈ కంపెనీల వెండార్లు, డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాలపై సోదాలు జరిగాయి.
మంగళవారం ప్రారంభమైన సోదాలు బుధవారం వరకు కొనసాగాయని, మొబైల్ కంపెనీ ప్రతినిధులను కూడా ఐటీ అధికారులు విచారించారని తెలుస్తోంది. ఆయా కంపెనీలు పెద్ద ఎత్తున పన్ను ఎగవేశాయనే నిఘా వర్గాల సమాచారం మేరకు సోదాలు జరిపారని తెలుస్తోంది. ఐటీ శాఖ ఈ కంపెనీలపై చాలాకాలంగా కన్నేసిందని, పన్ను ఎగవేతలపై పక్కా సమాచారం లభించడంతో సోదాలు జరిపిందని చెబుతున్నారు. సోదాల్లో భాగంగా పన్నులకు సంబంధించిన డిజిటల్ డేటా డిస్క్లను జఫ్తు చేశారని తెలుస్తోంది..

ఉత్పత్తుల సరఫరా, విక్రయం, ఆర్థిక సేవల్లో ఉన్న కొన్ని కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లుగా సమాచారం. పన్ను ఎగవేసినట్టు నిరూపించే డిజిటల్ సమాచారాన్ని గుర్తించి, సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్టు ఒప్పో, షియోమీ వెల్లడించింది. భారతీయ చట్టాలకు అనుగుణంగా వ్యాపారం చేస్తున్నామని తెలిపాయి. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో టెల్కో పరికరాల విక్రయంలో ఉన్న చైనాకు చెందిన జడ్టీఈపైనా ఐటీ తనిఖీలు జరిగాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..



Click it and Unblock the Notifications