ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకానికి కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి ఆధార్ నమోదును తప్పనిసరి చేసింది. eKYCని పూర్తి చేయడానికి మొదట మార్చి 31, 2021 నాటికి గడుును ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఈ గడువును మే 31వ తేదీ వరకు పొడిగించింది. అయినప్పటికీ రైతులు తమ ఆధార్ వివరాలను నమోదు చేయలేదు. దీంతో eKYC పూర్తి చేయడానికి జూలై 31వ తేదీ వరకు గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు పీఎం కిసాన్ వెబ్ సైట్లో పేర్కొంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు వారి బ్యాంకు ఖాతాలో ఒక్కో విడతలో రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు విడతల్లో రూ.6,000 పెట్టుబడి సాయం కింద అందిస్తోంది. eKYC పూర్తి చేయకుంటే 11వ ఇన్స్టాల్మెంట్ పీఎం కిసాన్లో ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ఇప్పుడు దీనిని నెల రోజులు పొడిగించడంతో రైతులకు భారీ ఊరట కలిగించే అంశం. eKYC పూర్తి చేయడానికి ఇలా చేయండి.

తొలుత పీఎం కిసాన్ వెబ్ సైట్ను సందర్శించాలి. eKYC ట్యాబ్ పైన క్లిక్ చేసి, ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయాలి. సెర్చ్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ పైన ఎంటర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, పక్కన ఉన్న గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కు 4 అంకెల ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి, సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
మళ్లీ ఆధార్ రిజిస్టర్డ్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు మరో ఓటీపీ వస్తుంది. దీనిని ఎంటర్ చేసి, సబ్మిట్ పైన క్లిక్ చేస్తే eKYC పూర్తవుతుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications