Andhra Pradesh: ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయి. స్వపక్షం, విపక్షం అని తేడా లేకుండా అందరికీ పథకాలను సీఎం జగన్ చేరువచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అమలు చేస్తున్న చాలా స్కీమ్ దేశంలోని చాలా రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి.
తాజాగా ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ కేంద్రం దృష్టిని ఆకర్షిస్తోంది. పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్), కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) రెండింటిలోనూ అత్యుత్తమమైనవని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)పై ఇప్పుడు కేంద్రం దృష్టి పడింది. ఈ స్కీమ్ "ఆసక్తికరమైనది" అని అధికారులు విశ్వసిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిని వివరంగా అధ్యయనం చేయాల్సి ఉంది.
ఈ పథకం మొదటిసారిగా ఏప్రిల్ 2022లో ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి తగ్గింపు లేకుండా చివరిగా డ్రా చేసిన బేసిక్ పేలో 33 శాతం గ్యారెంటీ పెన్షన్ను అందిస్తుంది. దీని కోసం వారు ప్రతి నెలా వారి బేసిక్ జీతంలో 10 శాతం విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఒకవేళ ఉద్యోగి అత్యధికంగా నెలకు 14 శాతాన్ని పెన్షన్ విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే.. వారు చివరగా తీసుకున్న జీతంలో 40 శాతాన్ని హామీ పెన్షన్ రూపంలో పొందేందుకు Guaranteed Pension Scheme వెసులుబాటు కల్పిస్తోంది. మార్కెట్ పరిస్థితుల ప్రభావం ఈ పెన్షన్ ను ప్రభావితం చేయదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ప్రస్తుత వడ్డీ రేట్లకు అనుగుణంగా.. ఇది సీపీఎస్ కింద అందుతున్న పెన్షన్ కంటే దాదాపు 70 శాతం ఎక్కువని ఆయన తెలిపారు.
ఏపీ కొత్తగా తీసుకొస్తున్న పెన్షన్ విధానం గురించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు వెల్లడించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ మోడల్ ఆసక్తికంగా ఉందని కాకపోతే దీని గురించి వివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications