For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: FY19 ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

|

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు గడువు తేదీని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) బుధవారం తెలిపింది.

మరింత ఊరట: ఐటీ రిటర్న్స్ గడువు నవంబర్ 30 వరకు పొడిగింపుమరింత ఊరట: ఐటీ రిటర్న్స్ గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు

వారందరికీ వర్తిస్తుంది

వారందరికీ వర్తిస్తుంది

2018-19 ఆర్థికసంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నామని, కరోనా కారణంగా తలెత్తుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (అసెస్‌మెంట్ ఇయర్ 2019-20) రిటర్న్స్ దాఖలు తేదీని జూలై 31వ తేదీ నుండి సెప్టెంబర్ 31 వరకు సీబీడీటీ పొడిగించిందని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. 2018-19కి సంబంధించి అసలు, సవరించిన రిటర్న్స్ దాఖలు చేసే వారందరికి పొడిగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

పొడిగింపు మూడోసారి

పొడిగింపు మూడోసారి

కరోనా నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఇలా వెసులుబాటు కల్పిస్తూ గడువును పొడిగించడం ఇది మూడోసారి. 2020 మార్చి 31వ తేదీగా గడువు ఉంది. దీనిని తొలుత జూన్ 30వ తేదీకి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా ఇబ్బందులు, లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో జూలై 31వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఇప్పుడు మూడోసారి సెప్టెంబర్ 30 వరకు డెడ్ లైన్ విధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

వీటికీ గడువు పెంపు..

వీటికీ గడువు పెంపు..

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ఇండివిడ్యువల్ ఎవరైనా గడువులోగా (ప్రస్తుతం సెప్టెంబర్ 30) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయలేరు. ఈ డెడ్ లైన్‌లోగా సవరించిన ఐటీఆర్‌ను కూడా ఫైల్ చేయవచ్చు. ఇంతకుముందు ఫైల్ చేసిన రిటర్న్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేయవచ్చు. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని నవంబర్ 30వ తేదీకి పొడిగిస్తూ ఊరట కల్పించిన విషయం తెలిసిందే. సాధారణంగా జూలై 31 లోపు దాఖలు చేయాలి. కరోనా నేపథ్యంలో దీనిని కూడా పొడిగించారు. 2015-16 నుండి 2019-20 వరకు ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది.

2015-16 నుండి 2019-20 ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవాలి2015-16 నుండి 2019-20 ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవాలి

English summary

గుడ్‌న్యూస్: FY19 ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు | CBDT extends deadline for filing Income Tax Returns till September 30

The government on Wednesday extended the deadline for filing income tax returns for 2018-19 fiscal by two months till September 30. "In view of the constraints due to the Covid pandemic & to further ease compliances for taxpayers, CBDT extends the due date for filing of Income Tax Returns for FY 2018-19 (AY 2019-20) from 31st July, 2020 to 30th September, 2020,” the Income Tax Department said in a tweet.
Story first published: Thursday, July 30, 2020, 8:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X