For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు నేర్చుకోవాల్సిందే!: ఇండియన్ సీఈవోలకు సత్య నాదెళ్ల

|

భారతీయ కంపెనీలు సొంత టెక్నాలజీని నిర్మించుకోవాలని, ఇండియన్ సీఈవోలు సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. ఆయన సోమవారం ముంబైలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవో సమ్మిట్‌లో మాట్లాడారు. ఇండియన్ బిజినెస్ లీడర్స్‌కు హితబోధ చేశారు.

వారంలోనే రూ.1,800... తొలిసారి రూ.43,000కు చేరిన బంగారం ధర: హైదరాబాద్‌లో ఎంతంటే?వారంలోనే రూ.1,800... తొలిసారి రూ.43,000కు చేరిన బంగారం ధర: హైదరాబాద్‌లో ఎంతంటే?

టెక్నికల్ కేపబులిటీ

టెక్నికల్ కేపబులిటీ

డిజిటల్ యుగంలో ముందుకు సాగాలంటే బిజినెస్ లీడర్స్, సీఈవోలు అందరూ తమ సొంత టెక్నికల్ కేపబులిటీని పెంపొందించుకోవాలన్నారు. ప్రకృతిలో మిళితమై ఉన్న సామర్థ్యాలను ఇండియన్ సీఈవోలు అలవర్చుకోవాలని సూచించారు. గత దశాబ్ద కాలంలో ఎన్నో మార్పులు వేగంగా చోటు చేసుకున్నాయన్నారు.

టెక్నాలజీ పరిశ్రమకు బయట

టెక్నాలజీ పరిశ్రమకు బయట

అగ్రిగేటర్లు దూసుకెళ్లాయని, కానీ అవి సరిపోవన్నారు. డిజిటల్ జోక్యం ఉత్పాదక సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఉపయోగపడుతుందని గుర్తించాలన్నారు. భారతదేశంలో 72 శాతం సాఫ్టువేర్ ఇంజినీర్ ఉద్యోగులు టెక్నాలజీ పరిశ్రమకు వెలుపల ఉన్నాయన్నారు.

ఇదే చెబుతాను..

ఇదే చెబుతాను..

ఇతర ఇండస్ట్రీస్‌కు చెందిన సీఈవోలతో మాట్లాడినప్పుడు కూడా సొంత సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తాను చెబుతానని అన్నారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ మరింత ముఖ్యమని, అందుకే ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. వచ్చే దశాబ్దంలో అత్యంత ప్రాధాన్యతను కలిగిన టెక్నాలజీలో తమ సొంత టెక్నాలజీ సామర్థ్యాన్ని నిర్మించుకోవాలన్నారు.

రాబోయే పదేళ్లలో..

రాబోయే పదేళ్లలో..

టెక్నాలజీ విషయంలో విమర్శలు వస్తూనే ఉంటాయని, కన్స్యూమర్ ఎకానమీ చాలా ముఖ్యమని సత్య నాదెళ్ల చెప్పారు. కానీ ఇది ఆర్థిక అంశానికి సంబంధించిన అంశం మాత్రమే కాదన్నారు. రాబోయే పదేళ్లలో విస్తృతమైన ఉత్పాదక అవసరమని, డిజిటల్ టెక్నాలజీ మారుతుందన్నారు. ఇండియన్ స్టార్టప్స్ నిర్మించిన అగ్రిగేటర్ బిజినెస్ మోడల్ విజయవంతమైందన్నారు.

శిక్షణ అవసరం..

శిక్షణ అవసరం..

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్య శిక్షణలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశంలోని యువతకు అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయని, అలాగే త్వరగా నేర్చుకునే తత్వం వారి సొంతమని, దానిపై వారికి శిక్షణ అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ తదితరులు పాల్గొన్నారు.

సీఈవోలు ఏమన్నారంటే..

సీఈవోలు ఏమన్నారంటే..

2020 నాటికి ఎగైల్ టెక్నాలజీలని పూర్తిగా స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ డెవలపర్‌లలో 59 శాతం మంది ప్రస్తుతం ఎగైల్‌పై పని చేస్తున్నారని టీసీఎస్‌ సీఎండీ రాజేష్ గోపినాథన్ వెల్లడించారు. భారత్ ప్రీమియమ్ డిజిటల్ సొసైటీగా అవతరించే అవకాశముందని ముఖేష్ అంబానీ అన్నారు.

English summary

మీరు నేర్చుకోవాల్సిందే!: ఇండియన్ సీఈవోలకు సత్య నాదెళ్ల | Build your own tech: Satya Nadella to Indian CEOs

For Indian companies, building own technology capability will be the defining development of the next decade, Microsoft CEO Satya Nadella said on Monday.
Story first published: Tuesday, February 25, 2020, 8:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X