న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ సహా వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. మందగమనానికి గల కారణాల్లో వినిమయం తగ్గడం. ముఖ్యంగా గ్రామీణ, నగర ప్రాంతాల్లో వినిమయం తగ్గింది. ఈ నేపథ్యంలో పీఎఫ్తో పాటు ఆదాయపు పన్నును సమీక్షించడం ద్వారా ప్రజల్లో వినిమయ శక్తి పెంచాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వచ్చాయి.

వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటు తగ్గింపుతో పాటు..
కార్పొరేట్ వర్గాలకు రూ.1.45 లక్షల కోట్ల మేర పన్ను ఊరట కల్పించిన కేంద్రం ఈసారి వ్యక్తిగత ఆదాయ పన్ను (పర్సనల్ ఇన్కం ట్యాక్స్) చెల్లింపుదారులకు భారీ ఊరట కల్పించనుందని భావిస్తున్నారు. ఆదాయపు పన్ను రేట్లతో పాటు ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన ఆర్జిత పన్ను (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్) సైతం తగ్గించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేందుకు..
వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం ఆదాయపు పన్ను రేట్లు తగ్గించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించినప్పటి నుంచి ఈ ప్రచారం సాగుతోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ అలాంటి ప్రచారమే సాగుతోంది. ఆదాయపు పన్ను రేట్లను సమీక్షించే అంశంపై ఆర్థిక నిపుణులతో చర్చిస్తున్నామని, ప్రస్తుత మందగమన పరిస్థితుల్లో ప్రజల చేతుల్లో ఎక్కువ మనీ ఉండే అంశంపై ఆలోచిస్తున్నట్లు అధికారులు వెల్లడించారని అంటున్నారు.

ఆర్థిక నిపుణుల సూచన
డిమాండ్ పెంచి, భారత ఆర్థిక వ్యవస్థను వృద్ధి మార్గం పట్టించేందుకు పలువురు నిపుణులు వివిధ సూచనలు చేశారు. ఇందులో భాగంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కూడా సూచిస్తున్నారు. వృద్ధి రేటు రెండో క్వార్టర్లో 4.5తో ఆరేళ్ల కనిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో 7 శాతంగా ఉంది.

వీటికీ ఊరట
మరోవైపు, ఇబ్బందుల్లో ఉన్న NBFCలకు ఉద్దీపనల ద్వారా, దేశీయంగా పెట్టుబడులు, తయారీని ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలు పెంచే యోచన కూడా ఉందని తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30% నుంచి 22%కు తగ్గించింది. కొత్త తయారీ యూనిట్లకైతే 15%కి తగ్గింది.
More From GoodReturns

SIP investment: రీల్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బులు గల్లంతే!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications