న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వృద్ధి రేటు ప్రతి ఏడాది పెరుగుతోంది. అయితే ఏడాది కాలంగా అంతర్జాతీయంగా, దేశంలో ఆర్థిక మందగమనం ఉంది. దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు క్వార్టర్లలో వృద్ధి రేటు 5 శాతానికి, 4.5శాతానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతంగా ఉంటుందని అంచనా.
2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని అంచనా వేశాయి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అంతకంటే తక్కువే ఉంటుందని చెబుతున్నాయి. ఇక, 2020-21వ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కాస్త పుంజుకుంటుందని, 6 శాతం నుంచి 7 శాతం వరకు ఉండవచ్చునని వివిధ ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి.

ఇదిలా ఉండగా నామినల్ జీడీపీ 10 శాతంగా ఉంటుందని మోడీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ద్రవ్యలోటు 7.67 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. 2020 జీడీపీలో ఇది 3.8 శాతం. 2021 జీడీపీలో 3.5 శాతం. 20219-20 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1 లక్ష కోట్ల రెవెన్యూ పెంచుకోవాలని చూసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, రానున్న ఆర్థిక సంవత్సరానికి దీనిని రూ.2.1 లక్షల కోట్లకు పెంచుకుంది.
బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తిరువళ్లూరు చెప్పిన ఐదు రత్నాలను ఆమె ప్రస్తావించారు. దేశ భద్రతే ప్రథమ కర్తవ్యం అన్నారు. రోగరహితం, సంపద ఉండటం, మంచి పంటలు, ఆనందం, భద్రత అని తిరువళ్లూరు చెప్పిన సూత్రాలు పేర్కొన్నారు. ఈ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్, రైతుల ఆదాయం రెట్టింపు, ఆనందమయ జీవితం, సంపద సృష్టికర్తలపై గౌరవం, దేశ భద్రత వంటి అంశాల్లో ఎంతో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications