Budget 2020: 2021 నామినల్ జీడీపీ 10 శాతం.. మోడీ ప్రభుత్వం అంచనా
న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వృద్ధి రేటు ప్రతి ఏడాది పెరుగుతోంది. అయితే ఏడాది కాలంగా అంతర్జాతీయంగా, దేశంలో ఆర్థిక మందగమనం ఉంది. దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు క్వార్టర్లలో వృద్ధి రేటు 5 శాతానికి, 4.5శాతానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతంగా ఉంటుందని అంచనా.
2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని అంచనా వేశాయి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అంతకంటే తక్కువే ఉంటుందని చెబుతున్నాయి. ఇక, 2020-21వ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కాస్త పుంజుకుంటుందని, 6 శాతం నుంచి 7 శాతం వరకు ఉండవచ్చునని వివిధ ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి.
ఇదిలా ఉండగా నామినల్ జీడీపీ 10 శాతంగా ఉంటుందని మోడీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ద్రవ్యలోటు 7.67 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. 2020 జీడీపీలో ఇది 3.8 శాతం. 2021 జీడీపీలో 3.5 శాతం. 20219-20 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1 లక్ష కోట్ల రెవెన్యూ పెంచుకోవాలని చూసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, రానున్న ఆర్థిక సంవత్సరానికి దీనిని రూ.2.1 లక్షల కోట్లకు పెంచుకుంది.
Budget 2020: ఆదాయాలు పెంపు, ప్రజలకు 4 శాతం ఆదా
బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తిరువళ్లూరు చెప్పిన ఐదు రత్నాలను ఆమె ప్రస్తావించారు. దేశ భద్రతే ప్రథమ కర్తవ్యం అన్నారు. రోగరహితం, సంపద ఉండటం, మంచి పంటలు, ఆనందం, భద్రత అని తిరువళ్లూరు చెప్పిన సూత్రాలు పేర్కొన్నారు. ఈ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్, రైతుల ఆదాయం రెట్టింపు, ఆనందమయ జీవితం, సంపద సృష్టికర్తలపై గౌరవం, దేశ భద్రత వంటి అంశాల్లో ఎంతో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు.