బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం 2020 క్యాలెండర్ ఏడాదిలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద 217 బిలియన్ డాలర్లు పెరిగింది. ఏడాదిలో వీరికి పెరిగిన సంపదతో 10 కోట్ల మంది అమెరికన్లకు ఒక్కొక్కరికి 2,000 డాలర్ల చెక్కులు ఇవ్వవచ్చునని అంచనా వేసింది. ప్రపంచ టాప్ 500 కుబేరుల సంపద గత ఏడాది 31 శాతం పెరిగింది. గత ఎనిమిదేళ్ల కాలంలో కుబేరులకు ఇదే అత్యధికమని బ్లూమ్బర్గ్ వెల్లడించింది.

వారి ఆదాయంతో 10కోట్ల మందికి
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సామాన్యులపై భారీగా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో అమెరికా ఇటీవల ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. అమెరికన్లకు ఏ మేరకు, ఎలా సాయం అందుతుందనే అంశం చర్చలో ఉండగానే, అమెరికా కుబేరుల సంపద 2020లో రికార్డ్ స్థాయిలో పెరగడం గమనార్హం. కేవలం జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ సంపద 217 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది పది కోట్లమంది అమెరికన్లకు 2000 డాలర్ల చొప్పున పంచితే వచ్చే దాంతో సమానం.

2020లో మస్క్ సంపద జూమ్
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద 190 బిలియన్ డాలర్లు. టెస్లా సీఈవో మస్క్ సంపద 170 బిలియన్ డాలర్లు. వీరు ప్రపంచ టాప్ తొలి, రెండో స్థానాల్లో నిలిచారు. ఎలాన్ మస్క్ సంపద 2020లో హఠాత్తుగా భారీగా పెరిగింది. ప్రధానంగా టెస్లా షేర్లు పెరగడంతో ఆయన ఆదాయం 75 శాతం వరకు పెరిగింది.

అమెరికా ప్యాకేజీ
కరోనా, లాక్ డౌన్, ఆర్థిక అస్తవ్యస్థత కారణంగా అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికన్ కాంగ్రెస్ కరోనా ప్యాకేజీలో భాగంగా అమెరికన్లకు 1200 డైరెక్ట్ పేమెంట్ను గత మార్చిలో ప్రకటించింది. ఆ తర్వాత రెండో ఆర్థిక ప్యాకేజీకి అమెరికన్లు 9 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. డిసెంబర్ నెలలో రెండో కరోనా ప్యాకేజీకి ఆమోదం లభించింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications